ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటామన్న పాక్‌

Published on Wed, 03/13/2019 - 02:58

వాషింగ్టన్‌: తమ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్‌ చెప్పింది. భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పాక్‌ హామీ ఇచ్చినట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ వెల్లడించారు. సోమవారం పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా  ఖురేషీ ఫోన్‌లో ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. ‘పాకిస్తాన్‌ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహమ్మద్, ఇతర ఉగ్రసంస్థలపై సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషీతో ఫోన్‌లో చెప్పాను’అని బోల్టన్‌ తెలిపారు.

జైషే పుల్వామాలో జరిపిన ఆత్మాహుతి దాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భారత ఉపఖండంలో తాజాగా జరిగిన పలు పరిణామాలపై వివరించేందుకు జాన్‌ బోల్టన్‌కు ఫోన్‌ చేసినట్లు పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది. శాంతి, సుస్థిరతను పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కోరుకుంటున్నారని, అందుకే ఐఏఎఫ్‌ పైలట్‌ను భారత్‌కు అప్పగించినట్లు ఖురేషీ వివరించినట్లు బోల్టన్‌ తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ