చంపేస్తామని బెదరించినా.. ఇరాక్‌లో అందాలపోటీ!

Published on Tue, 12/22/2015 - 19:19

ఇరాక్ లాంటి ఛాందస దేశంలో.. మహిళలు బురఖా లేకుండా బయటకు రావడమే కష్టం. ఏవైనా ఆటల్లో వాళ్లు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నా కాళ్లు కూడా కనపడకుండా దుస్తులు ధరించి పాల్గొనాలి. అలాంటి దేశంలో అందాల పోటీలు నిర్వహించడం అంటే మాటలా? కానీ.. 43 ఏళ్లలో తొలిసారిగా అక్కడ అందాల పోటీలు నిర్వహించారు. వాటిలో పాల్గొంటే చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినా లెక్క చేయకుండా షైమా ఖాసిం అనే యువతి మిస్ ఇరాక్ టైటిల్ గెలుచుకుంది. ఇరాక్‌లో కూడా ఇలాంటి పోటీలు జరగాలని ఈ పోటీల డైరెక్టర్ అహ్మద్ లీత్ అన్నారు. ఇక్కడి పరిస్థితి మరీ దారుణంగా ఉందని, లెబనాన్ లాంటి ఇతర దేశాలు చేస్తున్నట్లే తాము కూడా అందాల పోటీలు పెడదామని అనుకున్నామని ఆయన చెప్పారు.

తొలుత ఈ పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలోనే అమ్మాయిలు ముందుకొచ్చినా, తర్వాత పోటీ తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ.. క్రమంగా పల్చబడ్డారు. ఈ పోటీకి సంబంధించిన వెబ్‌సైట్‌లోను, ఫేస్‌బుక్ పేజిలోను లెక్కలేనన్ని హెచ్చరికలు పోస్ట్ అయ్యాయి. అన్నింటిలో ఉన్నది... అమ్మాయిలను చంపేస్తామన్న బెదిరింపులే. దాంతో మొదట్లో 200 మంది వరకు వచ్చిన పోటీదారులు, తర్వాత 10 మందికి పడిపోయారు. చివరకు యూనివర్సిటీ ఆఫ్ కిర్కుక్‌లో ఎకనమిక్స్ చదువుతున్న షైమా ఖాసిం (20) కిరీటాన్ని గెలుచుకుంది. అన్ని రకాల బెదిరింపులు, కష్టాలను దాటుకుని ఆమె ఈ కిరీటం గెలుచుకుందని, ఇది కేవలం ఈ పోటీలో విజయం మాత్రమే కాదని.. ఆమె తన జీవిత పోరాటంలో కూడా విజయం సాధించిందని అక్కడ అంతా అంటున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ