పాక్‌లో చీఫ్ జస్టిస్ కుమారుడు కిడ్నాప్

Published on Tue, 06/21/2016 - 12:59

కరాచీ: పాకిస్థాన్లో ఓ చీఫ్ జస్టిస్ కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కోర్టు పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరిన అతడిని ఆయుధాలతో వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు. సింద్ ప్రావిన్స్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కుమారుడు ఓవయిస్ సజ్జాద్ షా న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయన సోమవారం మధ్యాహ్నం కోర్టు పనులు ముగించుకొని పోష్ క్లిఫ్టాన్ ప్రాంతంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్లి బయటకు వస్తుండగా ఆయుధాలతో వచ్చిన నలుగురు దుండగులు ఎత్తుకెళ్లారు.

ఓ పచ్చ ఆకుపచ్చ నెంబర్ ప్లేట్ గల తెల్లకారులో వారు ఆయనను ఎత్తుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పాకిస్థాన్లో ఆకుపచ్చ నెంబర్ ప్లేట్లు ప్రభుత్వ వాహనాలకు మాత్రమే కేటాయిస్తారు. క్లిఫ్టాన్లోని తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన ఒవయిస్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడని, ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామని ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ