ఇందిరాక్యాంటీన్‌ అల్పాహారంలో బొద్దింక

Published on Mon, 10/23/2017 - 10:35

జయనగర(కర్ణాటక): ఇందిరా క్యాంటీన్‌లో అందించే అల్పాహారంలో బొద్దింక ప్రత్యక్షమైన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. అయితే చనిపోయిన బొద్దింకను గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వేసినట్లు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఈనెల 20న మాలగాళలో ఉన్న ఇందిరాక్యాంటీన్‌లో ఓ వ్యక్తి అల్పాహారం కోసం ఆర్డర్‌ ఇచ్చాడు. అయితే ఆహారపదార్థంలో బొద్దింక కనిపించింది. ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన  హేమంత్‌కుమార్‌ అనేవ్యక్తి  ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌చేశాడు. స్పందించిన పాలికె అధికారులు ఆ క్యాంటీన్‌లోని సీసీకెమెరాలను పరిశీలించారు.  గుర్తుతెలియని వ్యక్తులు  అల్పాహారంలో ఉద్దేశపూర్వకంగా బొద్దింక వదిలినట్లు గుర్తించారు. హేమంత్‌కుమార్‌తో పాటు అల్పాహారానికి వచ్చిన నలుగురిపై  పాలికె అధికారులు కామాక్షీపాళ్య పోలీస్‌స్టేషన్‌లో  ఆదివారం ఫిర్యాదు చేశారు. కాగా షేప్‌టాక్‌ అనే సంస్థ ఇందిరా క్యాంటీన్‌కు ఆహారాన్ని సరపరా చేస్తోంది.   
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ