8 నిమిషాలు 60 కోట్లు!

Published on Tue, 10/02/2018 - 02:45

సన్నివేశాల ప్రాముఖ్యతను బట్టి కొన్ని సార్లు భారీగా ఖర్చు పెడుతుంటారు. ‘సైరా: నర సింహా రెడ్డి’ క్లైమాక్స్‌ భాగానికి కూడా సుమారు 60 కోట్లు వరకూ ఖర్చు పెడుతున్నారట చిత్రబృందం. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా: నరసింహా రెడ్డి’. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలు. ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ ప్రస్తుతం జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

అక్కడ చిత్రీకరిస్తున్న యుద్ధ సన్నివేశాలు సుమారు 8 నిమిషాల పాటు ఉంటాయని సమాచారం. దీని కోసం ఏకంగా 60 కోట్లు వరకూ ఖర్చు పెడుతున్నారట. చిరంజీవి, జగపతిబాబు, సుదీప్‌ మరికొందరు నటీనటులు ఈ షూటింలో పాల్గొంటున్నారు. వీరితో పాటు ఈ భారీ క్లైమాక్స్‌ పోర్షన్‌లో 600 మంది జూనియర్‌ ఆర్టిస్ట్స్‌ పాల్గొంటున్నారట. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీత దర్శకుడు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ