నటి భావన కిడ్నాప్ కేసు.. సీఎం ప్రకటన

Published on Sun, 02/19/2017 - 13:00

కోచి: నటి భావనను కిడ్నాప్ చేసి, వేధింపులకు గురిచేసిన ఘటనను కేరళ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసులో నిందితులెవరినీ వదిలిపెట్టబోమని, వారిని శిక్షిస్తామని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రకటించారు. ఇప్పటి వరకు పోలీసులు ముగ్గురి నిందితులను అరెస్ట్ చేశారని, కేసును త్వరితగతిన విచారించాలని ఆదేశించినట్టు తెలిపారు.

కేరళ అడిషనల్ డీజీపీ సంధ్య మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు సునీల్ కుమార్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కేసు దర్యాప్తులో పురోగతి సాధించామని తెలిపారు. మిగిలిన నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని, త్వరలోనే అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు.

దక్షిణాది హీరోయిన్ భావనను కొందరు దుండగులు వేధించిన సంగతి తెలిసిందే. దుండగులు భావనను కారులో బందీగా చేసుకుని కారును కోచి నగరంలో గంటన్నర పాటు తిప్పారు. ఆ సమయంలో దుండగులు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించి ఫొటోలు, వీడియోలు తీశారు.

చదవండి: హీరోయిన్‌ను కారులో బందీగా చేసి..

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ