వాయిదా పడింది

Published on Fri, 07/20/2018 - 01:37

ఇటీవల బాలీవుడ్‌లో సినిమాల విడుదల తేదీలు తారుమారు అవుతున్నాయి. ఇప్పుడు ‘బట్టీ గుల్‌ మీటర్‌ చాలు’ మూవీ విడుదల తేదీ కూడా మారింది. ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ ఫేమ్‌ శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బట్టీగుల్‌ మీటర్‌ చాలు’. షాహిద్‌ కపూర్, శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్‌ ముఖ్య తారలుగా నటించారు. తొలుత ఈ సినిమాను ఆగస్టు 31న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఆ తేదీని ఆల్రెడీ రాజ్‌కుమార్‌ రావ్, శ్రద్ధాకపూర్‌ నటించిన ‘స్త్రీ’ చిత్రబృందం బుక్‌ చేసుకుంది.

వీటిలో ఏదో  ఒక సినిమా వాయిదా పడుతుందని బాలీవుడ్‌లో అనుకున్నారు. అనుకున్నట్లే...‘బట్టీగుల్‌ మీటర్‌ చాలు’ వాయిదా పడింది. ఈ సినిమా సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం లేటెస్ట్‌గా అనౌన్స్‌ చేసింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద శ్రద్ధా వర్సెస్‌ శ్రద్ధా తప్పినట్లే. అదేనండీ.. శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటించిన ‘స్త్రీ, బట్టీగుల్‌ మీటర్‌ చాలు’ సినిమాలు ఒకే రోజు విడుదల కావడం లేదని చెబుతున్నాం.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ