ఏం జరుగుతుంది?

Published on Wed, 06/19/2019 - 03:39

తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌ జంటగా రామకృష్ణ వెంప దర్శకత్వం వహించిన చిత్రం ‘దర్పణం’. శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మించిన ఈ సినిమా జూలైలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రామకృష్ణ వెంప మాట్లాడుతూ– ‘‘క్రైమ్, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జానర్‌లో వస్తోన్న చిత్రమిది. ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. తర్వాత ఏం జరుగుతుంది? అనే సస్పెన్స్‌ని చివరి నిమిషం వరకూ క్రియేట్‌ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది.

నటీనటులు, క్రాంతి కిరణ్‌గారి సహకారం మరచిపోలేనిది’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ వచ్చిన థ్రిల్లర్‌ సినిమాలను మించి మా సినిమా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన∙ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుని, సెన్సార్‌ పనుల్లో ఉంది. మా చిత్రానికి అందరి సహకారం కావాలి’’ అని క్రాంతి కిరణ్‌ వెల్లంకి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ ముత్యాల, సంగీతం: సిద్థార్ధ్, సదాశివుని. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ