రండి రండి.. దయ చేయండి

Published on Mon, 09/09/2019 - 05:52

ఎంటర్‌టైన్మెంట్‌ వరల్డ్‌లో మన దక్షిణాది చిత్రాలు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అమితాబ్‌ బచ్చన్, అక్షయ్‌కుమార్, సునీల్‌శెట్టి, వివేక్‌ ఒబెరాయ్‌.. వంటì  నటులు మన సౌత్‌ సినిమాల్లో నటించారు. ఇప్పుడు హాలీవుడ్‌ నటులు వస్తున్నారు. అనుష్క, మాధవన్, షాలినీ పాండే, అంజలి ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ నటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

తాజాగా ధనుష్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో మరో హాలీవుడ్‌ స్టార్‌ జేమ్స్‌ కాస్మో ఓ కీలక పాత్ర చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ లండన్‌లో జరుగుతోంది. ‘బ్రేవ్‌ హార్ట్, ట్రాయ్, గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు జేమ్స్‌ కాస్మో. ఆల్రెడీ హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ సౌత్‌ సినిమాలకు పని చేస్తున్న తరుణంలో ఇప్పుడు హాలీవుడ్‌ స్టార్స్‌ మన దక్షిణాది సినిమాలపై ఆసక్తి చూపించడం విశేషం. వై నాట్‌ స్టూడియోస్‌ పతాకంపై ఈ చిత్రాన్ని శశికాంత్, రామచంద్ర నిర్మిస్తున్నారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ