‘నా కోపానికి ఓ లెక్కుంది’

Published on Thu, 11/28/2019 - 15:07

ముంబై : ఏ అంశంపైనైనా బోల్డ్‌గా మాట్లాడే బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ తన ఆగ్రహం అర్ధవంతమైందని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ తనకు పట్టరాని కోపం వచ్చినా అది నిర్మాణాత్మకంగా ఉంటుందని తనకు ఓ విజన్‌, ప్రణాళిక ఉందని స్పష్టం చేశారు. మనల్ని వెనక్కి లాగే పద్ధతులకు తాను వ్యతిరేకమని, అవి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోవని..తాను ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసినా అది తన మంచికే దారితీసిందని కంగనా అన్నారు. తనలో చిన్న పిల్లల మనస్తత్వం ఉందని అది ఎవరి లాజిక్‌కూ అందదని వ్యాఖ్యానించారు.

తాను డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తానని అందరూ అనుకుంటారని కాని తాను వాటిని తెలివిగా వెచ్చిస్తానని చెప్పారు. తాను ప్రేమించే వారి కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడనని అన్నారు. తన మనసుకు దగ్గరైన సామాజిక​ కార్యక్రమాలకూ తాను ఖర్చు చేస్తానని కంగనా చెప్పారు. ఇక తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ తలైవిలో కంగనా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ