డెలివరీ కోసం హీరోయిన్ లండన్కు

Published on Fri, 07/22/2016 - 15:49

బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్లు డిసెంబర్లో మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ జంట డెలివరీ కోసం ముంబైలోగాక లండన్కు వెళ్లనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబైలో అయితే మీడియా ఫోకస్  ఎక్కువగా ఉంటుందని, కరీనాకు జన్మించే బిడ్డకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారని ఈ దంపతులు ఆందోళన చెందుతున్నట్టు వారి సన్నిహితులు చెప్పారు.

లండన్లో మీడియాకు దూరంగా కరీనా, సైఫ్ ఉండనున్నట్టు సమాచారం. కరీనా డెలివరీ సమయంలో పటౌడీ కుటుంబం ఆమె వద్దే గడపనుంది. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్, అతని సోదరి సోహా అలీఖాన్ ఎక్కువ సమయం కరీనాతో ఉండనున్నారు.

కరీనా ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇప్పటికే పలు వదంతులు వచ్చాయి. లండన్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారని, ఆమెకు జన్మించేది మగబిడ్డేనని మీడియాలో వార్తలురాగా.. కరీనా, సైఫ్ వీటిని ఖండించారు. అంతేగాక ప్రెగ్నెన్సీతో ఉన్న కరీనా ఫొటోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ