నవంబర్‌కు ‘నో టైమ్‌ టు డై’

Published on Thu, 03/05/2020 - 14:01

న్యూఢిల్లీ : జేమ్స్‌బాండ్‌గా డేనియల్‌ క్రేగ్‌ నటించిన ‘నో టైమ్‌ టు డై’ చిత్రం విడుదల తర్జనభర్జనల అనంతరం నవంబర్‌ నెలకు వాయిదా పడింది. ఈ చిత్రం బ్రిటన్‌లో ఏప్రిల్‌ రెండున, ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ పదవ తేదీన విడుదల కావాల్సి ఉండింది. కరోనా వైరస్‌ భయాందోళనల కారణంగా పలు దేశాల్లో థియేటర్లను మూసివేస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరి జోజి ఫుకునాగా దర్శకత్వం వహించిన ఈ చిత్రమే జేమ్స్‌బాండ్‌గా డేనియల్‌ క్రేగ్‌కు చివరిది. ఈ చిత్రాన్ని నవంబర్‌ 12వ తేదీన బ్రిటన్‌లో, నవంబర్‌ 25వ తేదీన అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర నిర్మాతలు మైఖేల్‌ జీ విల్సన్, బార్బర బ్రొకోలి ప్రకటించారు.

చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాల్లో ఇప్పటికే కరోనా భయాందోళనల వల్ల సినిమా థియేటర్లను మూసివేశారు. ఒక్క చైనాలో థియేటర్లను మూసివేయడం వల్ల ఇప్పటికే రెండు వందల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందట. పలు దేశాల్లో థియేటర్లను మూసివేయడం వల్ల దాదాపు 500 కోట్ల  డాలర్ల నష్టం వాటిల్లి ఉంటుందన్నది అంచనా.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ