ఏడేళ్ల తర్వాత...

Published on Wed, 07/18/2018 - 00:43

‘‘మాది చిత్తూరు. కానీ పెరిగిందంతా బెంగళూరులో. మాది సినిమా ఫ్యామిలీ కాదు. నా డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్‌ వచ్చి సినిమా చాన్సుల కోసం తిరిగాను. దాదాపు ఏడేళ్ల తర్వాత ‘పరిచయం’ చిత్రానికి చాన్స్‌ వచ్చింది’’ అని హీరో విరాట్‌ కొండూరు అన్నారు. విరాట్‌ కొండూరు, సిమ్రత్‌ కౌర్‌ జంటగా లక్ష్మీకాంత్‌ చెన్నా దర్శకత్వంలో రియాజ్‌ నిర్మించిన ‘పరిచయం’ ఈ నెల 21న విడుదలవుతోంది.

విరాట్‌ మాట్లాడుతూ– ‘‘ఓ యువ జంట మధ్య నడిచే ప్రేమకథ ఇది. కుటుంబ సన్నివేశాలు బాగుంటాయి. మంచి హాస్యభరితమైన సీన్స్, ఎమోషనల్‌ సీన్స్‌ ఉన్నాయి. రియాజ్‌గారు రాజీపడకుండా నిర్మించారు. మొదటి రోజే రాజీవ్‌ కనకాలగారితో నటించాను. ఆయన సరదాగా ఉంటారు. పృథ్వీగారు నటన పరంగా ఇచ్చిన సలహాలు ఉపయోగపడ్డాయి’’ అన్నారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ