అందరూ కొత్తవాళ్లతో...

Published on Tue, 08/21/2018 - 00:17

గీత్‌ ఆనంద్, చాందినీ భగ్వానాని జంటగా చంద్రశేఖర్‌ కానూరి దర్శకత్వంలో రూపొందిన  చిత్రం ‘రథం’. వినోద్‌ సమర్పణలో రాజా దారపునేని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను నిర్మాత నవీన్‌ ఎర్నేని, మోషన్‌ పోస్టర్‌ను డైరెక్టర్‌ బి.గోపాల్, సాంగ్‌ టీజర్‌ను సంగీత దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్‌ విడుదల చేశారు. చిత్ర నిర్మాత రాజా దారపునేని మాట్లాడతూ– ‘‘అందరూ కొత్తవాళ్లతో చేసిన చిత్రమిది. ఈ ఏడాది ‘రథం’ బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్మకంగా చెప్పగలను.

సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేయనున్నాం. చంద్రశేఖర్‌ మంచి హార్డ్‌వర్కర్‌. రూపాయికి పది రూపాయల అవుట్‌పుట్‌ ఇచ్చే వ్యక్తి. భవిష్యత్‌లో పెద్ద డైరెక్టర్‌ అవుతాడు’’ అన్నారు. ‘‘సినిమా విజయంపై మంచి అంచనాలతో ఉన్నాం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు చిత్ర సమర్పకులు వినోద్‌. ‘‘సినిమా అంటే ప్యాషన్‌ ఉన్న టీమ్‌తో పనిచేశాను. రిలీజ్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు గీత్‌ ఆనంద్‌. ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌ ముత్యాల, సంగీతం: సుకుమార్‌ పమ్మీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నివాశర్మ.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ