నటి వాణిశ్రీకి పుత్రశోకం

Published on Sun, 05/24/2020 - 02:44

ప్రఖ్యాత నటీమణి వాణిశ్రీ ఇంట విషాదం నెలకొంది. వాణిశ్రీ కుమారుడు అభినయ వెంకటేశ్‌ కార్తీక్‌ (36) శుక్రవారం రాత్రి హఠాన్మరణం పొందారు. అభినయ వెంకటేశ్‌ కార్తీక్‌ బెంగళూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల చెన్నై వెళ్లిన ఆయన తండ్రి కరుణాకరన్‌తో పాటు చెంగల్పట్టు జిల్లాలోని తిరుకళికుండ్రం గ్రామంలో ఉన్న ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారు. కార్తీక్‌ భార్య, పిల్లలు చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న వాణిశ్రీ ఇంట్లో ఉంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అభినయ వెంకటేశ్‌ కార్తీక్‌ తండ్రి వద్దే ఉండిపోయారు.

శుక్రవారం అర్ధరాత్రి ఫామ్‌హౌస్‌లో గుండెపోటు కారణంగా నిద్రలోనే కార్తీక్‌ మృతి చెందినట్టు వాణిశ్రీ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కార్తీక్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని వాణిశ్రీ కుటుంబసభ్యులు ఖండించారు. అభినయ వెంకటేశ్‌ కార్తీక్‌ భౌతికకాయాన్ని శనివారం చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. వాణిశ్రీకి పలువురు సినీ ప్రముఖులు సానుభూతి తెలిపారు. కార్తీక్‌ మృతిపై చెంగల్పట్టు పోలీసులు కేసు నమోదు చేశారు.
– సాక్షి, చెన్నై

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ