'పులి' నిర్మాతలపై శ్రీదేవి కేసు

Published on Sun, 11/08/2015 - 11:50

చాలా కాలం తరువాత పులి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి, ఆ సినిమా మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆ సినిమాలో శ్రీదేవి పాత్ర, ఆమె గెటప్, ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ అభిమానులను కూడా ఆకట్టుకున్నాయి.

అయితే శ్రీదేవి వెండితెర మీద కనిపించిన ఆనందం అభిమానులకు ఎక్కువ రోజులు మిగల్లేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పులి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ మూట కట్టుకుంది. దీంతో భారీగా ఉంటుందనుకున్న శ్రీదేవి రీ ఎంట్రీ అతిలోక సుందరి అభిమానులను నిరాశపరిచింది. సినిమా షూటింగ్ సమయంలో పులి యూనిట్ తో శ్రీదేవి కి వివాదాలున్నట్టుగా చాలా వార్తలు వినిపించినా వాటిని కొట్టి పారేశారు.

తాజాగా సినిమా రిలీజ్ అయిన ఇన్ని రోజుల తరువాత మరోసారి ఈ వివాదాలు తెర మీదకు వచ్చాయి. తనకు రావాల్సిన రెమ్యునరేషన్ మొత్తం ఇవ్వలేదంటూ పులి నిర్మాతలపై శ్రీదేవి ముంబై ఫిలిం ఛాంబర్ లో కంప్లయింట్ చేసింది. త్వరలోనే ఈ కంప్లయింట్ ను చెన్నై చాంబర్ కు పంపేందుకు సిద్దమవుతున్నారు ముంబై వర్గాలు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ