అమృత్‌సర్‌లో పేలుడు.. ముగ్గురి మృతి

Published on Sun, 11/18/2018 - 15:02

అమృత్‌సర్‌(పంజాబ్‌): అమృత్‌సర్‌ జిల్లా రాజస్సని ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి పైగా గాయపడ్డారు. ఆధ్యాత్మిక మందిరమైన నీరంకరి భవన్‌ వద్ద ఈ పేలుడు చోటు చేసుకుంది.  మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రార్థనా మందిరం వద్దకు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం మీద వచ్చి పేలుడు పదార్థాలు విసిరినట్లు తెలుస్తోందని స్థానిక పోలీస్‌ అధికారి సురీందర్‌ సింగ్‌ తెలిపారు.

ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరిందర్‌సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రకటించిన సీఎం..  గాయపడ్డవారికి ఉచిత వైద్యం అందివ్వనున్నట్లు స్పష్టం చేశారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ