అందరూ చూస్తుండగా కిడ్నాప్

Published on Tue, 05/17/2016 - 18:50

నోయిడా: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో పట్టపగలే జరిగిన కిడ్నాప్ సంచలనం రేపింది. గ్రేటర్ నోయిడాలో ఈ నెల 14న ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని కొంత మంది దుండగులు పట్టపగలు కిడ్నాప్ చేశారు. అందరూ చూస్తుండగా అతడిని లాక్కెళ్లి కారులో పరారయ్యారు.

అక్కడున్న వారిలో ఎవరూ కూడా కిడ్నాపర్లను ప్రతిఘటించలేదు. కళ్లెదుటే ఒక వ్యక్తిని దుండగులు లాక్కెళుతున్నా చూస్తుండి పోయారేగానీ, ఒక్కరూ  అడ్డుచెప్పలేదు. కిడ్నాప్ అయిన వ్యక్తి తర్వాత రోజు శవపై కనిపించాడు. అతడిని కిడ్నాప్ చేస్తుండగా తీసిన వీడియోను ఇంటర్నెట్ లో పెట్టడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగివుంటుందని అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు వెల్లడి కాలేదు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ