amp pages | Sakshi

మధ్యవర్తి 180 సార్లు ఇండియాకు వచ్చాడు!

Published on Wed, 05/11/2016 - 10:45

న్యూఢిల్లీః  అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆసక్తికర సమాచారాన్ని సాధించింది. ఎనిమిదేళ్ళలో ఓ మధ్యవర్తి ఇటలీనుంచి భారత్ కు తరచుగా 180 సార్లు  ప్రయాణించిన విషయం ఇప్పుడు పరిశోధక బృందాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఫారెన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) రికార్డులు పరిశీలించిన అధికారులకు వీవీఐపీ కుంభకోణంలో సదరు వ్యక్తి కీలక మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

అగస్టా కుంభకోణంలో ఓ మధ్యవర్తి కీలకంగా వ్యవహరించినట్లు తాజాగా సేకరించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. బ్రిటన్ జాతీయుడు క్రిస్టియన్ మిచెల్ కుంభకోణంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం మిచెల్  2005 నుంచి 2013 సంవత్సరాలమధ్య దాదాపు 180 సార్లు ఇండియాను సందర్శించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఛాపెర్ కుంభకోణంలో అతడు మధ్యవర్తిత్వాన్ని జరిపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మిచెల్ భారత్ సందర్శనల్లో ఎక్కువ శాతం ఢిల్లీలోనే  ఉండటమే కాక మధ్యవర్తిగా అభినవ్ త్యాగి, అతడి సహచరుడు, షెల్ సంస్థ డైరెక్టర్ జెబి. సుబ్రమణ్యం కూడ  ఉన్నట్లు ఎఫ్ఆర్ఆర్ఓ కార్యాలయంలో మిచెల్ ఇచ్చిన  సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఈ అభినవ్ త్యాగికి,  ముడుపులు అందుకున్న త్యాగి కుటుంబానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సీబీఐ, ఈడీ అధికారులు 2012  నుంచి 2013 మధ్య  ఢిల్లీకి జరిగిన సందర్శనలపై అన్వేషణ ప్రారంభించారు.

అయితే కుంభకోణంపై భారత్ లో దర్యాప్తు ప్రారంభమైన తర్వాత మిచెల్ ఇండియాలో ఒక్కసారి కూడ పర్యటించకపోవడమే కాక, అరబ్బు దేశాలకు పారిపోయి, అక్కడే నివసిస్తున్నట్లు తెలియడంతో ఈడీ ఇప్పటికే అతడి అరెస్టుకోసం అభ్యర్తన పంపింది. ఎనిమిది, తొమ్మిదేళ్ళలో 180 సార్లు దేశానికి పర్యటించడం అంటే ఆశ్చర్యకరమైన, అనుమానించదగ్గ విషయమేనని, అతడు ఇండియాలో సంజీవ్ త్యాగి సహా ఇతరులను కలసిన సమాచారాన్ని కూడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. భారత్ సందర్శించిన సమయంలో మిచెల్ ఎక్కువగా ఫైవ్ స్టార్ హోటళ్ళతోపాటు, అతడి 1.2 కోట్ల విలువైన, ఇప్పటికే అటాచ్ చేసిన, సఫ్దర్ జంగ్ ఎన్ క్లేవ్ లోని ఆయన నివాసంలో ఉండేవాడని ఓ సీనియర్ అధికారి చెప్తున్నారు.

Videos

కూటమికి బిగ్ షాక్

కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు

వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్

బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

మా మద్దతు సీఎం జగన్ కే

పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ

కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్

భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!

YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు

గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?

ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)