మర్యాదపూర్వక భేటీయే...

Published on Wed, 02/11/2015 - 10:15

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా ఢిల్లీలో అనధికార కాలనీల సమస్యలపై చర్చ జరిపినట్లు సమాచారం. సుమారు 60 లక్షల మంది అనధికారిక నివాసాల్లో ఉంటున్నారని, ఆ ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని వెంకయ్యను కోరినట్లు తెలుస్తోంది.

కేజ్రీవాల్తో మనీష్ సిసోడియా కూడా వెంకయ్యను కలిసినవారిలో ఉన్నారు. మరోవైపు వెంకయ్యతో కేజ్రీవాల్ మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ఆప్ తెలిపింది. కాగా కేజ్రీవాల్ ఈరోజు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవనున్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కూడా భేటీ కానున్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ