'ఈగో దెబ్బతింటుందని పాక్ అలా చేస్తోంది'

Published on Wed, 10/05/2016 - 13:07

జమ్మూ: తన అహంకారం సంతృప్తి చెందేందుకే భారత్ సర్జికల్ దాడులు నిర్వహించలేదని పాకిస్థాన్ అబద్ధం చెబుతోందని బీజేపీ ఆరోపించింది. పాక్ ఆర్మీ ఎప్పుడూ ఈగోతోనే ఉంటుందని, దానికి అహంకారం తక్కువ చేసుకోవడం ఇష్టం ఉండదని పేర్కొంది.అసలు భారత్ తమ ప్రాంతంలో ఎలాంటి సర్జికల్ దాడులు నిర్వహించలేదని పాక్ ఆరోపించడంపై జమ్మూలోని బీజేపీ అధికార ప్రతినిధి వీరేందర్ గుప్తా ఖండిస్తూ..

'భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ దాడులను అంగీకరించపోవడం వెనుక వాస్తవం ఏమిటంటే పాక్ ప్రభుత్వం, పాక్ ఆర్మీ తమ అహంకారంను ఎప్పుడూ తక్కువకానివ్వవు. వారి అహంకారం దెబ్బతింటుందనే ఇలా చేస్తున్నారు. ఇక ఆ దేశ ఆర్మీ అధికారి దిగిపోతున్న ఈ సమయంలో ఇలాంటిని అస్సలు అంగీకరించకదు' అని మండిపడ్డారు. ఈ సందర్భంగా భారత ఆర్మీని తక్కువ చేసేలా మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై, కశ్మీర్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ