జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
600 కోట్ల డ్రగ్స్ ఉన్న పాక్ పడవ పట్టివేత
Published on Wed, 05/22/2019 - 02:39
న్యూఢిల్లీ: రూ. 600 కోట్ల విలువైన మాదకద్రవ్యాలతో నిండిన పాకిస్తానీ పడవను భారత తీరప్రాంత భద్రతాదళం (ఇండియన్ కోస్ట్ గార్డ్–ఐసీజీ) మంగళవారం పట్టుకుంది. గుజరాత్ తీరానికి దూరంగా, రెండు రోజులపాటు సముద్రంలో 200 నాటికల్ మైళ్ల దూరం గాలించి ఈ పడవను పట్టుకున్నారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. పడవలోని ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని ఐసీజీ అదనపు డీజీ వీఎస్ఆర్ మూర్తి తెలిపారు. నిఘా వర్గాలు, ఐసీజీ అధికారులతో కూడిన సంయుక్త బృందం వారిని విచారిస్తుందని మూర్తి వెల్లడించారు. కాగా, 8 నాటికల్ మైళ్లపాటు భారత జలాల్లోకి ప్రవేశించి చేపలు పడుతున్న ‘అల్–మదీనా’ అనే మరో పడవను కూడా ఐసీజీ మంగళవారం గుర్తించింది.
#
Tags