‘మధ్యప్రదేశ్‌లో ఆ మూవీ విడుదల కానివ్వం’

Published on Fri, 12/28/2018 - 14:32

భోపాల్‌ : ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ మూవీపై వివాదం ముదురుతోంది. ఈ సినిమా ట్రైలర్‌పై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా తాజాగా ఈ సినిమా తమకు ముందుగా ప్రదర్శించకుంటే మధ్యప్రదేశ్‌లో మూవీ విడుదల కానివ్వబోమని కాంగ్రెస్‌ నేత సయ్యద్‌ జాఫర్‌ హెచ్చరించారు. సినిమా పేరుతో పాటు ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను చిత్ర దర్శకుడికి లేఖ రాశానని చెప్పారు.

మూవీ ట్రైలర్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీలను తక్కువ చేసి చూపారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. 2004 నుంచి 2008 మధ్య ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీడియా సలహాదారు సంజయ్‌ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను అదే పేరుతో తెరకెక్కిస్తున్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత రాజకీయాల్లో మన్మోహన్‌ సింగ్‌ను బలిపశువుగా చూపేలా ట్రైలర్‌లో చూపారని కాంగ్రెస్‌ మండిపడుతోంది. కాగా సంజయ్‌ బారు పుస్తకం ఆధారంగానే తాము సినిమా రూపొందించామని మన్మోహన్‌ పాత్రను పోషించిన నటుడు అనుపమ్‌ ఖేర్‌ చెబుతున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ