రోడ్డుపై క‌రోనా వారియ‌ర్‌: ప‌ట్టించుకోని జ‌నం

Published on Sun, 05/31/2020 - 11:31

భోపాల్‌: క‌రోనా వారియర్‌ స్పృహ తప్పి ప‌డిపోతే ఏ ఒక్క‌రూ చ‌లించ‌లేదు. అరగంట‌కు పైగా రోడ్డు మీద ప‌డి ఉన్న స‌ద‌రు పారామెడిక‌ల్ సిబ్బందికి స‌హాయం చేసేందుకు ఏ ఒక్క‌రూ ముందుకు రాలేదు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని సాగ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. పీపీఈ కిట్లు ధ‌రించిన‌ పారామెడిక‌ల్ సిబ్బంది క‌రోనా రోగుల‌ను చికిత్స నిమిత్తం జిల్లాలోని టీవీ ఆస్ప‌త్రి నుంచి బుందేల్‌ఖండ్ మెడిక‌ల్ కాలేజీకి త‌ర‌లించారు. అనంత‌రం తిరిగి ఆస్ప‌త్రికి బ‌య‌లు దేరారు. (ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..)

ఈ క్ర‌మంలో వారిలో ఓ వ్య‌క్తి ఉన్న‌ప‌ళంగా రోడ్డుపై ప‌డిపోయాడు. ఈ క్ర‌మంలో అత‌నికి ర‌క్ష‌ణగా నిల‌వాల్సిన సహోద్యోగులు అత‌డిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో అత‌ను 25 నిమిషాల పాటు రోడ్డుపై అచేత‌నంగా ప‌డిపోయి ఉన్నాడు. రోడ్డు వెంట వెళుతున్న వారు కూడా చూస్తూ వెళ్లిపోయారే త‌ప్పితే సాయం చేసేందుకు ముందడుగు వేయ‌లేదు. స‌ద‌రు విష‌యం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని అత‌డిని జిల్లా ఆసుప‌త్రిలో చేర్పించింది. అయితే అత‌ను అప‌స్మారక స్థితిలోకి వెళ్ల‌డానికి గ‌ల కార‌ణాలు తెలియరాలేదు. (చచ్చిపడిన గబ్బిలాలు.. స్థానికుల్లో ఆందోళన!)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ