2,300 కిలోల వజ్రాలు, ముత్యాలు వెనక్కి

Published on Thu, 06/11/2020 - 02:08

న్యూఢిల్లీ:  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసగించారంటూ ప్రముఖ వజ్రాల వ్యాపారులు నీరవ్‌ మోదీ(48), మెహుల్‌ చోక్సీ(60)పై నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. హాంకాంగ్‌లోని వారి సంస్థల నుంచి 2,340 కిలోల పాలిష్డ్‌ వజ్రాలు, ముత్యాలను బుధవారం వెనక్కి తీసుకొచ్చింది. వీటి విలువ రూ.1,350 కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 108 బ్యాగేజీల్లో వీటిని తీసుకొచ్చారు. ఇందులో నీరవ్‌ మోదీకి చెందినవి 32, చోక్సీకి చెందినవి 76 ఉన్నాయి.

ఈ మొత్తం వజ్రాలు, ముత్యాలు, నగలను 2018లో వారు హాంకాంగ్‌ నుంచి దుబాయ్‌కి తరలించేందుకు ప్రయత్నించారు. ఇండియా దర్యాప్తు అధికారులు అప్రమత్తం కావడంతో అది ఫలించలేదు. ముంబైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ తప్పుడు గ్యారంటీలు చూపించి, 2 బిలియన్‌ డాలర్ల రుణం తీసుకున్నారు. ఈ రుణం తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. దీనిపై కేసు నమోదు చేసి ఈడీ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా హాంకాంగ్‌లో నీరవ్‌ మోదీ, చోక్సీ సంస్థల నుంచి వజ్రాలు, ముత్యాలు, వెండి నగలను వెనక్కి తీసుకొచ్చింది. వీటిని మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద సీజ్‌ చేసింది. 2018లో విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీని ఈడీ అధికారులు గతేడాది లండన్‌లో అరెస్టు చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ