వలస కార్మికులు.. వాస్తవాలు

Published on Thu, 06/04/2020 - 14:04

సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు అంతా ఇంతా కాదు. వారు ఓపిక పట్టలేక కాలి నడకన ఇళ్లకు బయల్దేరారంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వలస కార్మికులు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నది అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

1. వలస కార్మికులు ఓపిక లేక ఇంటిబాట పట్టలేదు. వారికి ఉపాధి పోయింది కనుక ఇంటి బాట పట్టారు.
2. వారిలో ఎక్కువ మంది దినసరి కూలీలే. ఇంటి అద్దె కట్టలేక, తినడానికి ఇంత తిండిలేక ఇంటి బాటపట్టారు.
3. లాక్‌డౌన్‌ కారణంగా 80 శాతం మంది పట్టణ కార్మికులు ఉపాధి కోల్పోయారని అజిమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీ నిర్వహించిన సర్వే లెక్కలు తెలియజేస్తున్నాయి. 16 శాతం పట్టణ వాసులకు వారానికి సరిపడా నిత్యావసర సరకులను కొనుగోలుచేసే శక్తి లేదు.
4. లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు ఏ మూలకు సరిపోలేదు. మరోపక్క ప్రభుత్వ గిడ్డంకుల్లో లక్షల టన్నుల ఆహార ధాన్యాలు కుళ్లిపోయాయి.
5. వలస కార్మికుల తరలింపునకు వేసిన ప్రత్యేక శ్రామిక రైళ్లు వారికి ఏ మూలకు సరిపోలేదు. ఆ రైళ్లు ఎక్కిన వలస కార్మికులు అన్న పానీయాల కోసం అలమటించారు.
6. మే 9వ తేదీ నుంచి మే 27వ తేదీ మధ్య ఆకలితో, ఎండ తీవ్రతను తట్టుకోలేక రైళ్లలో 80 మంది వలస కార్మికులు మరణించారు. ఈ విషయాన్ని రైల్వే రక్షణ దళమే తెలియజేసింది.
7. వలస కార్మికుల కష్టాలు ఐదు రోజులో, ఐదు వారాలో కొనసాగలేదు. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంతర్రాష్ట్ర రవాణా సౌకర్యాలను ప్రభుత్వం రద్దు చేయడంతో వలస కార్మికులు దొరికిన వాహనాన్ని ఎక్కిపోవడానికి ప్రయత్నించడమే కాకుండా, కాలినడకన కూడా స్వస్థలాలకు బయల్దేరారు. రోడ్డు మార్గాల్లో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 200 మంది కార్మికులు మరణించారు.

చదవండి: కార్మికులకు ఓపిక లేకనే... అమిత్‌ షా

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)