కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేయడం నా ప్రజాస్వామిక హక్కు: మాల్యా

Published on Fri, 04/27/2018 - 17:04

లండన్‌ : మే 12న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడం తన ప్రజాస్వామిక హక్కు అని లిక్కర్‌ కింగ్‌, బ్యాంకులకు కోట్లాది రుణాల ఎగవేత కేసులో నిందితుడు విజయ్‌ మాల్యా అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. బ్యాంకులకు రూ వేల కోట్లు ఎగవేత కేసులో విచారణ ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్న మాల్యాకు బ్రిటన్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

బ్యాంకులకు రూ 9000 కోట్లు బకాయిలు, మనీల్యాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా రెండేళ్లుగా బ్రిటన్‌లో తలదాచుకున్నారు. కాగా, బెయిల్‌ నిబంధనల ప్రకారం తాను బ్రిటన్‌ను వీడి వచ్చే అవకాశం లేదని మాల్యా వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజకీయాలను తాను ఇటీవల పరిశీలించకపోవడంతో వాటిపై వ్యాఖ్యానించలేనని చెప్పారు. మాల్యా అప్పగింత కేసు ప్రస్తుతం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో విచారణ జరుగుతోంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ