అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘సీఎం పళనిస్వామిని చంపేస్తా’
Published on Mon, 04/29/2019 - 03:49
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని చంపేస్తామని వచ్చిన ఓ ఫోన్కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. చెన్నై ఎగ్మూర్లోని కంట్రోల్ రూమ్కు శనివారం రాత్రి ఓ యువకుడు ఫోన్ చేశాడు. ‘నా పేరు గురుశంకర్. కొడైకెనాల్ బస్టాండ్ వద్ద సీఎం పళనిస్వామిని హతమారుస్తా. ఇదే నా సవాల్’ అని కాల్ కట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీస్వర్గాల్లో కలకలం చెలరేగింది. ఉన్నతాధికారులు సీఎం నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విచారణ ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు తమకు ఫోన్చేసిన వ్యక్తిని దిండుగల్ జిల్లా విరాళి పట్టికి చెందిన గురుమూర్తిగా(25)గా గుర్తించారు. గురుశంకర్ తండ్రి రామమూర్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కొడైకెనాల్లో గాలింపు ముమ్మరం చేశారు.
#
Tags