-
ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
Delhi: ఏపీ భవన్లో యాత్ర 2 సినిమా ప్రదర్శన
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఏపీ భవన్లో శనివారం యాత్ర-2 సినిమా ప్రదర్శించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ గురు మూర్తి, వైఎస్ఆర్ అభిమానులు, ప్రేక్షకులు సినిమాను వీక్షించారు. సినిమా ఆసాంతం ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యారు. అభిమానులు జై జగన్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రజల కోసం సీఎం జగన్ సంక్షేమ యాత్ర ఇలాగే కొనసాగుతుందన్నారు. ఆయన పాదయాత్రలో నడిచే అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పారు. జ్వరంతో బాధపడుతున్నా యాత్ర ఆపకుండా నడిచిన నాయకుడని కొనియాడారు. నవరత్నాల పాలనతో ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్ జగన్ను ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారన్నారు. ఇదీ చదవండి.. గంగ పుత్రులపై పెద్ద మనసు చాటుకున్న సీఎం జగన్ -
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఎంపీ గురుమూర్తి ఫైర్
-
స్విగ్గీకి మరో షాక్.. వేరుకుంపటికి సిద్ధమైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ గురుమూర్తి కంపెనీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇక్కడి నుంచి నిష్క్రమించి తన సొంత వెంచర్ను ప్రారంభించబోతున్నారని ఈ పరిణామాలు తెలిసిన వ్యక్తులను ఉటింకిస్తూ ‘మనీకంట్రోల్’ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. గత మార్చిలో స్విగ్గీ ఇన్స్టామార్ట్ను ఏర్పాటు చేసిన గురుమూర్తి.. కొన్ని రోజులు తెరమరుగై మళ్లీ మే నెలలో స్విగ్గీ మాల్కు అధిపతిగా తిరిగి వచ్చారు. స్విగ్గీ మాల్ను గతంలో స్విగ్గి మ్యాక్స్ అని పిలిచేవారు. ఇది హైపర్లోకల్ ఆన్లైన్ షాపింగ్ విభాగం. కార్తీక్ గురుస్వామి ప్రారంభించనున్న వెంచర్ ఇప్పుడు స్విగ్గీ నిర్వహిస్తున్నలాంటిదే. అయితే ఇది ఆఫ్లైన్ స్పేస్లో ఉంటుంది. జర్మనీకి చెందిన సూపర్మార్కెట్ చైన్ ఆల్డీ లాంటి చవక ధరల భౌతిక దుకాణం మోడల్ను కార్తీక్ గురుస్వామి భారత్లో ప్రారంభించనున్నారు. కొన్ని నెలల క్రితం గురుమూర్తి తన వెంచర్ కన్వెనియోకు నిధుల కోసం మ్యాట్రిక్, యాక్సెల్ వంటి వెంచర్ క్యాపిటల్ సంస్థలను కలిశారు. ఈ వెంచర్ పేరునే ఆయన మార్చే అవకాశం ఉంది. అయితే దీనిపై గురుమూర్తి కానీ, స్విగ్గీ, మ్యాట్రిక్, యాక్సెల్ కంపెనీలు కానీ స్పందించలేదు. కాగా స్విగ్గీ మాల్కు అధిపతిగా దీపక్ కృష్ణమణిని నియమించింది. దీన్నిబట్టి గురుమూర్తి నిష్క్రమణకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. గత నెలలో స్విగ్గీలో చేరిన కృష్ణమణి అంతకుముందు అమెజాన్లో దాదాపు ఏడేళ్లు, దానికిముందు మారికోలో తొమ్మిదేళ్లు పనిచేశారు. వరుస నిష్క్రమణలు స్విగ్గీలో టాప్-లెవల్ నిష్క్రమణలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు జాబితాలో గురుమూర్తి కూడా చేరనున్నారు. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేల్ వాజ్ కూడా తన సొంత వెంచర్ను ప్రారంభించడానికి నిష్క్రమించారు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఇన్స్టామార్ట్ రెవెన్యూ అండ్ గ్రోత్ హెడ్ నిషాద్ కెంక్రే కంపెనీ విడిచిపెట్టిన కొన్ని రోజులకే మే నెలలో వైస్ ప్రెసిడెంట్, బ్రాండ్ అండ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆశిష్ లింగంనేని కూడా కంపెనీని వీడారు. అదేవిధంగా, రెవెన్యూ అండ్ గ్రోత్ విభాగాన్ని నిర్వహించే సీనియర్ వైస్ ప్రెసిడెండ్ అనూజ్ రాఠి కూడా ఫిన్టెక్ కంపెనీ జూపిటర్లో చేరేందుకు స్విగ్గీ నుంచి నిష్క్రమించారు. -
మణిపూర్: అమిత్ షా అఖిలపక్ష భేటీ.. ఏపీ, టీఎస్ నుంచి వెళ్లింది వీరే..
సాక్షి, ఢిల్లీ: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రహోం మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ ఘర్షనల నేపథ్యంలో నేడు(శనివారం) అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు.. శుక్రవారం కూడా మరోసారి మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాల ప్రకారం.. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని, సాధారణ స్థితిని పునరుద్ధరించే మార్గాలపై ఆలోచించడమే అఖిలపక్ష సమావేశం ఉద్దేశమని అమిత్ షా చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుందని తెలిపారు. అయితే, మణిపూర్ ఘర్షణల తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఇక, ఈ సమావేశానికి ఏపీ నుంచి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ వినోద్ హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా.. మణిపూర్లో హింసాత్మక ఘటన నేపథ్యంలో తొమ్మిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నోంగ్తోంబమ్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని వారు విమర్శలు చేశారు. ఐదు అంశాలతో కూడిన మెమోరాండంను మోదీకి సమర్పించిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై, పరిపాలనపై తమకు నమ్మకం లేదన్నారు. చట్టపరంగా పరిపాలన అనుసరించడం ద్వారా సరైన పరిపాలన, ప్రభుత్వ పనితీరు కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందవచ్చు అని లేఖలో వివరించారు. కాగా, ఈ ఎమ్మెల్యేలంతా మైతి సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. లేఖపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలు వీరే.. - కరమ్ శ్యామ్ సింగ్, - తోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్, - నిషికాంత్ సింగ్ సపం, - ఖ్వైరక్పం రఘుమణి సింగ్, - ఎస్. బ్రోజెన్ సింగ్, - టీ. రవీంద్రో సింగ్, - ఎస్, రాజేన్ సింగ్, - ఎస్. కేబీ దేవి, - వై. రాధేశ్యామ్. ఇది కూడా చదవండి: ఇండిగో విమానంలో మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేయడంతో.. -
గురుమూర్తి కుటుంబానికి 10లక్షల ఎక్స్గ్రేషియా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కాగా, బాలాసోర్ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి మృతిచెందారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అండగా నిలుస్తూ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒడిశా రైలు ప్రమాదం ఘటనలో సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైలు ప్రమాదంలో మృతిచెందిన గురుమూర్తి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రం సాయానికి అదనంగా పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇది కూడా చదవండి: AP: రైలులో ప్రయాణించిన వాళ్ల ఫొటో, వివరాలు వాట్సాప్ చేయండి.. నెంబర్ ఇదే.. -
గంగమ్మ జాతర: ‘పుష్ప-2’ అల్లు అర్జున్ గెటప్లో ఎంపీ గురుమూర్తి (ఫోటోలు)
-
రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం సాకులు చెబుతోంది: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం సాకులు చెబుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, గురుమూర్తి మండిపడ్డారు. ఏపీ భవన్లోని గురజాడ హాలులో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టులో రాష్ట్ర వాటాను తగ్గించాలని, విభజన హామీలపై పార్లమెంటులో నిలదీస్తామన్నారు. గట్టిగా ప్రశ్నిస్తాం: ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తామని ప్రకటించిన హామీలను నెరవేర్చాలని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో గట్టిగా ప్రశ్నిస్తామని ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు అన్నారు. రైల్వే పరంగా బడ్జెట్లో రాష్ట్రానికి ఈ సారి రూ. 8500 కోట్లు కేటాయించామని గణాంకాల్లో చెబుతున్నా, వాటిని ఏ విధంగా ఖర్చు చేయబోతోందీ రైల్వే శాఖ సవివరంగా చెప్పాలని కోరుతున్నామని తెలిపారు. రాష్ట్రం వైపు నుంచి భూసేకరణకు మేము డబ్బులివ్వడం లేదని రైల్వే సాకులు చెబుతోందన్నారు. అయితే ఇవన్నీ 2014 కుముందు మంజూరయిన వాటి గురించి కేంద్రం చెబుతోంది తప్ప రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన మార్పులు, రాష్ట్ర ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడడం లేదన్నారు. తిరిగి చర్చలు జరిపి, రాష్ట్ర వాటా విషయంలో మార్పులు చేయాలని తమ విజ్ఞప్తిగా పేర్కొన్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో దీనిపై పార్లమెంటులో గట్టిగానే ప్రశ్నిస్తామన్నారు. జాతీయ రహదారుల విషయంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జాతీయ రహదారిపైకి అరగంటలో చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారని, దీనికనుగుణంగానే ఎక్కువ జాతీయ రహదారులను మంజూరు చేయించుకోగలిగామని, జగన్ గారి ఆశయసాధన కోసం త్వరితంగా ఈ పనులు పూర్తి చేయిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వాటా తగ్గించాలి నడికుడి–శ్రీకాళహస్తి ప్రాధాన్యమైన రైల్వే లైను. కేంద్ర రాష్ట్రాల మధ్య 2014కు మందు కుదిరిన ఒప్పందాన్నే ఇప్పుడూ కొనసాగించాలనడం సరికాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అప్పటి ఆర్థిక స్థితి వేరు ...విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి వేరుగా ఉంది. బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోనే ఇలాంటి ఒప్పందాలను మార్చుకున్న ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. మన రాష్ట్ర వాటా విషయంలో తగ్గించాలన్నది మా విన్నపం. దీనిపై పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా పట్టుబడతామని వివరించారు. మోడల్ బస్టాండుగా తిరుపతి: ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి తిరుపతి తీర్థయాత్రా నగరం కనుక, ఇక్కడి బస్టాండును సమున్నతంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ విజయవాడ వచ్చినప్పుడు, సీఎం జగన్ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనికనుగుణంగా రూ. 500 కోట్లతో మోడల్ బస్టాండుకు వచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఎంపీ గురుమూర్తి అన్నారు. అలానే, తిరుపతిలో రోప్వే కు సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ప్రతిపాదించాం. శ్రీకాళహస్తిలోనూ రోప్వేకు ప్రతిపాదనలు తయారు చేశాం. విద్యా పరంగా అభివృద్ధి కోసం.. నైలెట్ సంస్థ ను తిరుపతిలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని, దీనికి సంబంధించి ఒక బృందం కూడా వచ్చి సర్వే చేసింది. అవసరమైన భవనాలనూ గుర్తించి, కేంద్రానికి ప్రతిపాదనలు చేశామని, దీనికి త్వరలో అనుమతులు రానున్నాయని పేర్కొన్నారు. తిరుపతిలో కేంద్ర ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం: ఢిల్లీ వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ గారు- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాను కలిసి తిరుపతిలో కేంద్ర ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆ ఫైలు మహిళా భద్రతా విభాగం డైరెక్టరేట్ వద్ద ఉందని, అదీ సాకారమయ్యే అవకాశముందని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో సైదాపురం మండలంలో రెండు కేంద్రీయ విద్యాలయ భవనాలు శిథిల స్థితిలో ఉన్నాయని , ఇవి నిర్మించి 50 ఏళ్లయిందని చెప్పారు. ఈ పాఠశాలల భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్ స్పష్టమైన హామీ ఇచ్చి, ప్రతిపాదనలు పంపాలని కోరారని చెప్పారు. స్టాప్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలూ చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి తెలిపారు. జాతీయ ఉత్సవ పోర్టల్లో తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం బ్రహ్మోత్సవాలు: తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల కేలండర్ను జాతీయ ఉత్సవ పోర్టల్లో కాని, జాతీయ పర్యాటక కేలండర్లో కాని చూపడం లేదన్నారు. తమ విజ్ఞప్తి మేరకు మొన్ననే ఉత్సవ పోర్టల్లో చేర్చారని ఎంపీ గురుమూర్తి చెప్పారు. శ్రీకాళహస్తి, కాణిపాకం బ్రహ్మోత్సవాల వివరాలనూ ఉత్సవ పోర్టల్లో చూపాలని కోరామని, వాటినీ ఆ పోర్టల్లో చూపుతారని ఆశిస్తున్నామన్నారు. తిరుపతిలో ప్లానిటోరియం ఏర్పాటుకు కేంద్రాన్ని కోరామని, రూ. 13 కోట్లతో ప్లానిటోరియం ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిందని చెప్పారు. దీనికీ బదులిస్తున్నామన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆహార ప్రయోగశాల ఏర్పాటుకు రూ. 10 కోట్లు మంజూరయిందని ఎంపీ గురుమూర్తి చెప్పారు. మహిళా విశ్వవిద్యాలయంలో మరో ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. చదవండి: ఏంటి లోకేశా ఇదీ?.. నరాలు కట్ అయిపోతున్నాయ్..! తిరుపతి స్విమ్స్లో కేన్సర్ పరికరాల కొనుగోలు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సామాజిక బాధ్యత పథకం (సీఎస్ఆర్) కింద అవసరమైన పరికరాల కోసం రూ. 22 కోట్లు కేటాయించిందని, ఒప్పందం కూడా కుదుర్చుకున్నామని చెప్పారు. రహదారుల పరంగా చూస్తే రూ. 7వేల కోట్లతో జాతీయ రహదారి పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. రూ.560 కోట్లతో క్రిబ్కో యూనిట్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. శ్రీకాళహస్తి–నడికుడికి మరిన్ని కేటాయింపులపై అడుగుతాం శ్రీ కాళహస్తి– నడికుడి రైల్వే పనులకు రూ. 220 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్న అసంతృప్తి ఉందని, దీన్ని వ్యతిరేకిస్తున్నామని, ఎక్కువ నిధుల మంజూరు కోసం ఒత్తిడి చేస్తామని తెలిపారు. కృష్ణపట్నం ప్రాంతంలో కార్గో టెర్మినల్ అనుమతులు తుది దశలో ఉన్నాయని, దీనికీ త్వరగా అనుమతులు ఇస్తే అక్కడ రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ పనులన్నింటి విషయంలో సీఎం జగన్ తమను పరుగులు పెట్టిస్తూ, అభివృద్ధి సాధనకు తమను ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని తెలిపారు. -
Tirupati: వెంకన్న పాదాల చెంత ఎన్ఐఈఎల్ఐటీ..
తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక రాజధానిగా అవతరిస్తోంది. ఇప్పటికే బహుళజాతి కంపెనీలు, పారిశ్రామిక వాడలు, ప్రముఖ విద్యాసంస్థలతో అలరారుతోంది. ఇప్పుడు సరికొత్తగా మానవ వనరుల అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. నిరుద్యోగ సమస్య రూపుమాపడం, యువతకు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్ మెరుగుపరచడం, ప్రపంచ స్థాయిలో రాణించేలా వివిధ కోర్సులు అందించడమే లక్ష్యంగా నైలెట్ సంస్థ ముందుకు వచ్చింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: వెంకన్న పాదాల చెంత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణకు ఎన్ఐఈఎల్ఐటీ బృందం తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో సోమవారం శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఐఐడీటీ కేంద్రాన్ని బృందం పరిశీలించింది. తిరుపతిలో ఎన్ఐఈఎల్ఐటీ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కమిటీ చైర్మన్, సంస్థ డైరెక్టర్ స్పష్టం చేశారు. నైలెట్ అంటే ఏంటి? దాని ముఖ్యఉద్దేశాలు ► ఎన్ఐఈఎల్ఐటీ(నైలెట్) భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న స్వయం ప్రతిపత్తమైన శాస్త్రీయ సంఘం. ► ఎన్ఐఈఎల్ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మానవనరులు అభివృద్ధి, సంబంధిత కార్యకలాపాలు అందుకు ఉపయోగపడే కోర్సులు అందించడం ముఖ్య ఉద్దేశం. ► ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలతో కూడిన శిక్షణ, గుర్తింపు సేవలను అందించడం ద్వారా ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అనుబంధ రంగాలలో నాణ్యమైన మానవ వనరులను ఉత్పత్తి చేస్తుంది. ఎన్ఐఈఎల్ఐటీ అందిస్తున్న కోర్సులు ఫార్మల్ కోర్సుల్లో భాగంగా మూడేళ్ల బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ టెక్నాలజీ, వి.ఎల్.ఎస్.ఐ డిజైన్, నాన్ ఫార్మల్ రంగంలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, హార్డ్వేర్, సైబర్ చట్టం, సైబర్ భద్రతా, భౌగోళిక సమాచార వ్యవస్థ, క్లౌడ్ కంప్యూటరింగ్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ – మ్యానుఫ్యాక్చరింగ్, ఇ–వ్యర్థాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్, ఇ–గవర్నెన్స్ వంటి కోర్సులు అందిస్తుంది. దేశంలో అత్యుత్తమమైన యూనివర్సిటీలలో ప్రాచుర్యం పొందిన కోర్సులను ఉమ్మడి భాగస్వామ్యంలో అందుబాటులోకి తీసుకురావడం నైలెట్ ప్రత్యేకత. ఎన్ఐఈఎల్ఐటీ తిరుపతిలో నెలకొల్పడం ద్వారా వృత్తి విద్య కోర్సుల తోపాటు అనుదినం మారూతున్న టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం అందుకు అవసరమైన కోర్సులు నేర్చుకోనేందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన పనిలేకుండా తగిన నైపుణ్యాన్ని ఈ విశ్వవిద్యాలయం అందిస్తుంది. కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు వారి అర్హతలను బట్టి అవకాశాలను కూడా కల్పిస్తుంది. తైవాన్, జపాన్, చైనా, కొరియా వంటి దేశాలతో అవగాహన ఒప్పందం కలిగి ఉండడంతో విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. తిరుపతి జిల్లాలో త్వరలో ఐటీ కాన్సెప్ట్ సిటీ నెలకొల్పబోతున్నారు. తిరుపతి జిల్లాలో శ్రీసిటీ, రేణిగుంటలో ఈఎంసీ, మేనకూరు పారిశ్రామికవాడలో నెలకొల్పిన దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయనున్నారు. స్థానికంగా ఉన్న యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్య కు పరిష్కారం లభిస్తుంది. – మద్దెల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి -
అమలాపురం అల్లర్ల ఘటన: ‘ఆ రెండు పార్టీలు ఎందుకు ఖండించడం లేదు’
సాక్షి, తిరుపతి: అమలాపురం అల్లర్ల ఘటనను తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన దురదృష్టకరమని.. దానిని అందరూ ముఖ్త కంఠంతో ఖండించాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ఘటనను ఎందుకు ఖండించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. కుట్ర పూరిత రాజకీయాలు మానండని ప్రతి పక్షాలకు ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని కుట్రలో భాగంగా ఇలా చేశారని ఎంపీ ఆరోపించారు. రాజకీయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక కులాల మధ్య ఇలాంటి చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి, ప్రతి పక్ష పార్టీల నుంచి, సామజిక సేవా సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లాల పేర్లను ప్రకటించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్వార్ధ రాజకీయాల కోసం యువతను పెడతోవ పట్టించవద్దని ఎంపీ గురుమూర్తి కోరారు. -
వెంకటేశ్వరస్వామి వేష ధారణలో తిరుపతి ఎంపి గురుమూర్తి
-
వెంకన్న వేషధారణలో ఎంపీ గురుమూర్తి
సాక్షి, తిరుపతి (కల్చరల్): తిరుపతిలోని తాతయ్యగుంట గంగ జాతర మహోత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన గంగమ్మ తల్లి ఆధ్యాత్మిక భక్తి చైతన్య యాత్రలో తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి గంగమ్మకు సోదరుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వారి వేషం ధరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తిరుపతి చరిత్రలో తొలిసారి: కనీవిని ఎరుగని రీతిలో స్పందన
‘రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రూపుమాపాలి. పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక ఇళ్ల వద్ద ఖాళీగా ఉన్న యువతీ, యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. తల్లిదండ్రులతోపాటు ఆ కుటుంబాలకు అండగా నిలవాలి’ అనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు అనూహ్య స్పందన లభించింది. రాయలసీమ జిల్లాల్లోని యువతీయువకులు తండోపతండాలుగా తరలివచ్చారు. జాబ్మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో సత్తాచాటి ఉద్యోగాలు దక్కించుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. సాక్షి, తిరుపతి రూరల్/తిరుపతి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోనే మొదటి సారి తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి పాదా ల చెంత శనివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభిచింది. ఎస్వీ ఆడిటోరియంలో ఎంపీ విజయసాయిరెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఇన్చార్జి దేవేంద్రరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటైన జాబ్మేళాకు రాయలసీమ జిల్లాల నుంచి సుమారు 43 వేల మంది హాజరయ్యారు. వీరంతా మెగా జాబ్మేళా అఫిషియల్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకున్నారు. పది. ఇంటర్, డిప్లొమో, బీటెక్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వివిధ కంపెనీల ప్రతినిధులు ఆశావహులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. విద్యార్హత, అనుభవం, నైపుణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉద్యోగాలు సాధించిన 4,784 మందిలో తక్షణం 410 మందికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. చరిత్రలో మొదటి సారి తిరుపతి చరిత్రలో ఇప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ మెగా జాబ్మేళా నిర్వహించింది. సరిగా నడవలేని స్థితిలో కొందరు, చంటిబిడ్డలతో మరికొందరు, డిగ్రీలు చదివి ఉద్యోగాలు రాని యువతీయువకులు ఎందరో.. సర్టిఫికెట్లు చేతబట్టి తండోపతండాలుగా తరలివచ్చారు. జాబ్మేళా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన క్యూలు కిక్కిరిసిపోయాయి. జాబ్మేళాలో చంద్రగిరి, సత్యవేడు, పలమనేరు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆదిమూలం, వెంకటేగౌడ్, ప్రభుత్వ సలహాదారు (ఏపీ స్కిల్ డెవలప్మెంట్) చల్లా మధుసూదన్రెడ్డి, జాబ్మేళా తిరుపతి ఇన్చార్జ్ దేవేందర్రెడ్డి, ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.. పక్కాగా ఏర్పాట్లు ►మెగాజాబ్ మేళాకు వచ్చిన నిరుద్యోగులకు నేతలు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ►పోలీస్ బృందాలతో భారీ బందోబస్తుతోపాటు మహిళలు, పురుషులకు వేర్వేరుగా క్యూలు ఏర్పాటు చేశారు. ►ఎండ వేడిమికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి చోటా షామియానాలు ఏర్పాటు చేసి అభ్యర్థులకు ఎప్పటికప్పుడు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. మధ్యాహ్నం ఇబ్బందులు పడకుండా భోజనం సమకూర్చారు. ►దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వలంటీర్లను నియమించారు. మూడు చక్రాల సైకిళ్లలో జాబ్మేళా కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టారు. ►జాబ్మేళా కేంద్రాల ప్రత్యేక సూచిక బోర్డులు, నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. వీటితోపాటు ప్రతి గదిలోనూ అభ్యర్థులకు సలహాలిచ్చేందుకు వలంటీర్లను నియమించారు. గొప్ప అవకాశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున మెగా జాబ్ మేళా నిర్వహించడం నిరుద్యోగులకు గొప్ప వరం. పెద్ద కంపెనీల ద్వారా జాబ్మేళా నిర్వహించారు. ఇంటర్వుల్లో పాల్గొని సాఫ్ట్ వేర్గా ఎంపికయ్యాను. చాలా ఆనందంగా ఉంది. జగనన్నకు కృతజ్ఞతలు. – ఖాజా మస్తాన్, కావలి కల నెరవేరింది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాలన్న కల నెరవేరింది. ఉన్నతమైన కంపెనీలో ఉద్యోగం కోసం ఎదురు చూశాను. ఈ మెగా జాబ్ మేళా ద్వారా అది సాధ్యమైంది. బంధువులు స్నేహితులతో గర్వంగా సాఫ్ట్వేర్ అని చెప్పుకోగలను. అమ్మనాన్నలకు నా వంతు సహకారం అందిస్తా. – హారికారెడ్డి, తిరుపతి పేర్లు నమోదు చేసుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మెగాజాబ్ మేళా నిరంతర ప్రక్రియ. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం. ఉద్యోగం రాని వారు నిరాశ చెందకుండా తిరిగి మళ్లీ ప్రయత్నించాలి. రిజిస్ట్రేషన్ల కోసం వైఎస్సార్సీపీ ఏర్పాటుచేసిన ప్రత్యేక వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలి. – విజయసాయిరెడ్డి, ఎంపీ ఇది ప్రారంభం మాత్రమే తిరుపతి వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మేగా జాబ్మేళా రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు వరం. సామాజిక బాధ్యత, నిరుద్యోగ సమస్య రూపుమాపేందుకు పార్టీ ఆధ్వర్యంలో ఇంతపెద్ద మెగాజాబ్ మేళా నిర్వహించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రథమం. ఇది ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో మరిన్ని జాబ్మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే మా పార్టీ లక్ష్యం. – గురుమూర్తి, ఎంపీ తిరుపతి -
తిరుపతిలో సీఎం కప్ పోటీలు ప్రారంభించిన ఎంపీ గురుమూర్తి
-
సీపీఐ నారాయణకు కాలికి గాయం.. వైద్యం చేసిన ఎంపీ డాక్టర్ గురుమూర్తి
సాక్షి, తిరుపతి: అసెంబ్లీలోనే విపక్షం, స్వపక్షాలు అనే మాట. బయట అందరు ఒకరితో ఒకరు కలిసిపోతారు. ఎక్కడో కొందరు నేతలు మాత్రం బయట కూడా ద్వేషాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ ఫోటోపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ను కకావికలం చేసిన సంగతి తెలిసిందే. ఊళ్లకు ఊళ్లే నీట మునిగాయి. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రాయల చెరువు.. చుట్టుపక్కల ప్రాంత ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. పై నుంచి వస్తోన్న వరద కారణంగా చెరువు ఎప్పుడు తెగుతుందో అర్థం కాక చుట్టూ పక్కల ఊర్ల జనాలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. (చదవండి: ప్రమాదకరంగా రాయలచెరువు.. రాత్రంతా చెరువు వద్దే ఎమ్మెల్యే చెవిరెడ్డి) ఈ క్రమంలో సీపీఐ నాయకుడు నారాయణ బుధవారం రాయలచెరువు సందర్శనకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనుకోకుండా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్ గురిమూర్తి నారాయణకు వైద్యం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మార్గాని భరత్ రామ్ తన ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. గురుమూర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: వరద సాయం అందడంలో తప్పులు జరగకూడదు: సీఎం జగన్ -
జగనన్న పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నరు
-
‘పోలవరం ప్రాజెక్ట్కు తక్షణమే రూ. 55వేల కోట్లు ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించినా.. కేంద్రం పటించుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్, గురుమూర్తి.. పోలవరం ప్రాజెక్ట్ అంశం మీద లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్ట్కు జీవం పోసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అన్ని అనుమతులు తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్దే. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పోలవరంకు 55వేల కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలి. 29 నెలలు గడిచినా ఇంకా పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించలేదు. పోలవరం ప్రాజెక్టు ఆఫీస్ను రాజమండ్రికి తరలించాలి’’ అని కోరినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు. ఏపీ ప్రయోజనాల కోసం పని చేస్తాను: గురుమూర్తి ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులు, తిరుపతి ప్రజల దీవెనలతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాను. ఏపీ ప్రయోజనాలను సాధించేందుకు పని చేస్తాను. విభజన హామీల అమలు కోసం ప్రతి నిమిషం పోరాడుతాం’’ అన్నారు తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి. -
శ్యామ్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ
సాక్షి, కేవీపల్లె : బెంగళూరులో ఈ నెల 12న కరోనాతో మృతి చెందిన వైఎస్సార్ సీపీ నేత, పార్టీ ఐటీ వి భాగం ప్రధాన కార్యదర్శి కలకడ శ్యామ్సుందర్రెడ్డి అలియాస్ శ్యామ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. ఆదివారం శ్యామ్ స్వగ్రామం కేవీపల్లె పంచాయతీ మూల కొత్తపల్లెలో ఆయన కు పెద్దకర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ సమాధి వద్ద పార్టీ కండువా, పూల మాలలతో నివాళులర్పించారు. అనంతరం శ్యామ్ సతీమణి సుప్రియతోపాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేసిన శ్యామ్ను కరోనా కబలించడం దురదృష్టకరమన్నారు. ఐటీ విభాగంలో చురుగ్గా పనిచేసి పార్టీ విజయానికి విశేష కృషి చేశారని తెలిపారు. శ్యామ్ మృతి పార్టీకి తీరని లోటన్నారు. పార్టీ ప రంగా శ్యామ్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, పార్టీ యువజన విభాగం కన్వీనర్ గజ్జెల శీన్ రెడ్డి, నాయకులు జయరామచంద్రయ్య, రామకొండారెడ్డి, చిన్నయర్రమరెడ్డి, సహదేవరెడ్డి, సై ఫుల్లాఖాన్, వేణుగోపాల్రెడ్డి, శ్రీనివాసులు, హ రి, సిరినాయుడు, గౌస్ పాల్గొన్నారు. -
సీఎం జగన్ను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
-
సీఎం జగన్ను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరుపతి ఎంపీ డా.గురుమూర్తి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీ సాధించిన నేపథ్యంలో మంత్రులను, ఎమ్మెల్యేలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. గురుమూర్తి వెంట డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, సంజీవయ్య తదితరులు ఉన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు పట్టంగట్టి తామంతా ఆయన వెంటే ఉన్నామని తిరుపతి ఎన్నికల ఫలితాల సాక్షిగా ప్రజలు మరోసారి నిరూపించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తిని 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించి వరుసగా మూడోసారి పార్టీకి ఘన విజయం చేకూర్చారు. కరోనా పరిస్థితి వల్ల పోలింగ్ శాతం తగ్గిపోయినా వైఎస్సార్సీపీ ఓట్ల శాతం మాత్రం గతం కంటే పెరగడం గమనార్హం. చదవండి: ఫ్యాన్ స్పీడ్కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ నిన్ను నమ్మం బాబూ.. -
Maddila Gurumoorthy: ఇది ప్రజావిజయం
నెల్లూరు (సెంట్రల్)/తిరుపతి తుడా: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో తన విజయం ప్రజా విజయమని ఎంపీగా గెలుపొందిన మద్దిల గురుమూర్తి చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో ఎంపీగా గెలుపొందిన తర్వాత ఆదివారం ఆయన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, కిలివేటి సంజీవయ్యలతో కలిసి నెల్లూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రం డీకేడబ్ల్యూ కళాశాలలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చక్రధర్బాబు నుంచి ధ్రువీకరణపత్రాన్ని అందుకున్నారు. అనంతరం అక్కడ, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రం వద్ద గురుమూర్తి విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని, సంక్షేమం, అభివృద్ధితో ప్రజలు తనను దీవించారని చెప్పారు. ముఖ్యమంత్రికి తాను రుణపడి ఉంటానని, తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి ప్రజల మద్దతుతో గెలిపించిన సీఎం జగన్ లక్ష్యానికి అనుగుణంగా ప్రజల కోసం పనిచేస్తానని, నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. సీఎం అడుగుజాడల్లో నడవడమే తన లక్ష్యమన్నారు. ఈ విజయం జగనన్నదేనని చెప్పారు. సాధారణ వ్యక్తి అయిన తనను పార్లమెంట్కు పంపించాలన్న జగనన్న సంకల్పం గొప్పదన్నారు. ఇలాంటి మంచి మనసున్న జగనన్న దేశ రాజకీయాల్లో సరికొత్త ముద్ర వేస్తున్నారని తెలిపారు. ధ్రువీకరణపత్రం అందుకునే కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు పి.రూప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
Tirupati Election Results 2021: ‘ఫ్యాన్’ హ్యాట్రిక్
సాక్షి, అమరావతి: వరుసగా మూడుసార్లు నెగ్గి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ హ్యాట్రిక్ సాధించింది. 2014 నుంచి తాజా ఎన్నికల వరకు పార్టీ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించడం గమనార్హం. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గినా భారీ మెజారిటీని కైవసం చేసుకుంది. అప్పుడు 13,16,473 (79.76 శాతం) ఓట్లు పోల్ కాగా తాజా ఉప ఎన్నికలో 11,04,927 (64.42 శాతం) పోలయ్యాయి. అంటే ఈసారి 2,11,546 (15.34 శాతం తక్కువ) ఓట్లు తక్కువగా పోలయ్యాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్ 55.03 శాతం ఓట్లతో 2,28,376 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇప్పుడు డాక్టర్ ఎం.గురుమూర్తి 56.67 శాతం ఓట్లతో 2,71,592 ఓట్ల మెజార్టీ సాధించారు. 2019లో పోలైన ఓట్లలో వైఎస్సార్సీపీ మెజార్టీ శాతం 15.38 అయితే ఇప్పుడు మెజార్టీ శాతం 24.59 కావడం గమనార్హం. అంటే 23 నెలల్లోనే జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మెజారిటీ 9.21 శాతం పెరిగింది. టీడీపీ దీనావస్థ.. రెండు దఫాలు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన పనబాక లక్ష్మి 2019 ఎన్నికల్లో 4,94,501 ఓట్లు సాధించగా ఈసారి ఆమెకు 3,54,516 ఓట్లు మాత్రమే దక్కాయి. 2019లో టీడీపీకి 37.65 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 32.08 శాతం మాత్రమే వచ్చాయి. అంటే 5.57 శాతం ఓట్లు తగ్గాయి. అది కూడా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి సర్వశక్తులు ఒడ్డితే ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీఎస్పీ 20,971 (1.60 శాతం) ఓట్లు సాధిస్తే అప్పుడు బీజేపీకి 16,125 (1.22 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే 37,096 ఓట్లు (2.82 శాతం) వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 57,080 ఓట్లు (5.17 శాతం) సాధించింది. ఇదే అత్యధికం తిరుపతిలో 1989 సాధారణ ఎన్నికల దగ్గర్నుంచి పరిశీలిస్తే ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి గురుమూర్తి సాధించిన మెజారిటీనే అత్యధికమని స్పష్టమవుతోంది. -
తిరుపతిలో వైఎస్సార్సీపీ ఘన విజయం
సాక్షి, తిరుపతి / సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనకు పట్టంగట్టి తామంతా ఆయన వెంటే ఉన్నామని తిరుపతి ఎన్నికల ఫలితాల సాక్షిగా ప్రజలు మరోసారి నిరూపించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తిని 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించి వరుసగా మూడోసారి పార్టీకి ఘన విజయం చేకూర్చారు. కరోనా పరిస్థితి వల్ల పోలింగ్ శాతం తగ్గిపోయినా వైఎస్సార్సీపీ ఓట్ల శాతం మాత్రం గతం కంటే పెరగడం గమనార్హం. గత ఎన్నికలే కాదు 1989 నుంచి చూసినా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడిన పార్టీలు ఫ్యాన్ ప్రభంజనంలో కొట్టుకుపోయాయి. బీజేపీ – జనసేన, కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కాగా టీడీపీ మరోసారి పరాజయం పాలైంది. తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందడంతో గత నెల 17వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో 11,04,927 ఓట్లు పోల్ కాగా 64.42 శాతం ఓటింగ్ నమోదైంది. కరోనా కారణంగా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహించింది. తిరుపతి ఎన్నికల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ అక్కడే మకాం వేసి రోజుల తరబడి ప్రచారం నిర్వహించారు. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలోఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. బహిరంగ సభను కూడా రద్దు చేసుకున్నారు. తాను అధికారం చేపట్టిన తరువాత 22 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ప్రజలకు లేఖ రాశారు. 56.67 శాతం ఓట్లతో విజయభేరీ.. తిరుపతి ఉప ఎన్నికలో పోలైన మొత్తం 11,04,927 ఓట్లలో అధికార పార్టీకి సగానికిపైగా 56.67 శాతం ఓట్లు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.76 శాతం పోలింగ్ నమోదు కాగా 55.03 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా పోలింగ్ శాతం తగ్గినా గత ఎన్నికల కంటే 1.64 శాతం ఓట్లను అధికంగా వైఎస్సార్సీపీ సాధించడం గమనార్హం. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ స్వయంగా ప్రచార రంగంలోకి దిగి ఇంటింటికీ తిరిగినా 2019 ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి 5.57 శాతం ఓట్లు తగ్గిపోవడం గమనార్హం. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. జనసేన జతకట్టడంతో బీజేపీ 5.2 శాతం ఓట్లతో ఎట్టకేలకు ‘నోటా’ను అధిగమించింది. కాంగ్రెస్ 1.78 శాతం ఓట్లను కోల్పోగా సీపీఎం 0.5 శాతం ఓట్లకే పరిమితమైంది. పోస్టల్ బ్యాలెట్ నుంచే ఆధిక్యం.. ఆదివారం ఉదయం 8 గంటలకు నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో సూళ్లూరుపేట, వెంకటగిరి గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాలకు, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ నుంచే వైఎస్సార్సీపీ ఆధిక్యం కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్లలో 809 ఓట్ల ఆధిక్యంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఖాతా తెరిచారు. ఆ తర్వాత నుంచి ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ప్రతి నియోజకవర్గంలోనూ సగటున 35 నుంచి 40 వేల ఓట్ల ఆధిక్యంతో కొనసాగారు. మొదటి రౌండ్ నుంచి 20వ రౌండ్ వరకు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆధిక్యం పూర్తి స్థాయిలో కొనసాగింది. ఆ సమయంలో గురుమూర్తితోపాటు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. మొదటి రౌండ్లోనే వైఎస్సార్సీపీకి భారీ మెజార్టీ రావడంతో పనబాక లక్ష్మి నిరుత్సాహంతో వెనుదిరిగారు. మారుమూల గ్రామం.. మధ్య తరగతి కుటుంబం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మారుమూల గ్రామం మన్నసముద్రం దళితవాడకు చెందిన మద్దెల గురుమూర్తిది సామాన్య కుటుంబం. తండ్రి మునికృష్ణయ్య రెండెకరాల ఆసామి. అది కూడా 1975లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిందే. ఈ భూమికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టా ఇచ్చారు. ప్రస్తుతం అందులో మామిడి సాగు చేస్తున్నారు. గురుమూర్తి తల్లి రమణమ్మ గృహిణి. ఆయనకు ఐదుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. ఐదో తరగతి వరకు మన్నసముద్రంలో, ఆరు నుంచి 10వ తరగతి వరకు పక్కనే ఉన్న బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో, ఆ తర్వాత ఇంటర్ తిరుపతిలో చదువుకున్నారు. అనంతరం స్విమ్స్లో ఫిజియోథెరఫీ పూర్తి చేశారు. మహానేత స్ఫూర్తి.. జగనన్న వెన్నంటి.. గురుమూర్తి స్విమ్స్లో ఫిజియోథెరఫీ చేస్తున్న సమయంలో విద్యార్థి సంఘం నేతగా నాడు సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని తరచూ కలిసేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేపట్టిన పాదయాత్రలో ఆయన వెంటే నడిచారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో తన వెంటే నడిచి ప్రజల కష్టాలు తెలుసుకున్న డాక్టర్ గురుమూర్తిని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. డాక్టర్ గురుమూర్తి పేరును ప్రకటించిన రోజే ఆయన విజయం ఖరారైంది. ప్రజలపై ముఖ్యమంత్రి ఉంచిన నమ్మకాన్ని ఉప ఎన్నిక ఫలితం ద్వారా మరోసారి నిరూపించారు. డిక్లరేషన్ అందుకున్న గురుమూర్తి.. ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ ఎం.గురుమూర్తికి ఆదివారం రాత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవిఎన్ చక్రధర్బాబు డిక్లరేషన్ అందజేశారు. గురుమూర్తితో పాటు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్కుమార్యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గురుమూర్తి నెల్లూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ ఘన విజయం అందరిదీ నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు: సీఎం జగన్ ట్వీట్ సాక్షి, అమరావతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఘన విజయం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘23 నెలల పాలన తరవాత తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు మన ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా ఆశీర్వదించారు. ఈ ఘన విజయం ప్రజలందరిదీ. నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు. తిరుపతి పార్లమెంటు ఓటర్లు 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజారిటీతో దీవిస్తే.. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మనసారా దీవించి.. నన్ను, మన ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రోజు 2.71 లక్షల మెజారిటీ ఇవ్వటం ద్వారా చూపించిన అభిమానం, గౌరవం ఎంతో గొప్పవి. ఇది నా బాధ్యతను మరింతగా పెంచుతుంది. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతోనే ఈ విజయం సాధ్యమైంది..’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. -
ఫ్యాన్ స్పీడ్కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ
సాక్షి, తిరుపతి: ఏ ఎన్నిక చూసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. సాధారణ ఎన్నికలు మొదలుపెట్టుకుని మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ గిర్రున తిరుగుతోంది. వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగిస్తూ ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని శక్తిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను మెచ్చి ఇప్పుడు అనివార్యంగా వచ్చిన తిరుపతి లోక్సభ ఎన్నికలోనూ ఓటర్లు వైఎస్సార్సీపీకి తిరిగి ఎంపీ స్థానం కట్టబెట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటును సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ ఇప్పుడు ఉప ఎన్నికలోనూ సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించింది. డాక్టర్ గురుమూర్తి తిరుపతి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందడం విశేషం. తిరుపతి లోక్సభ పరిధిలో మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లె నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ స్థానాలన్నింటిలోనూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే ఉండడం విశేషం. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రచారానికి రాకపోయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి పార్టీ అభ్యర్థి గురుమూర్తి తిరుగులేని ఆధిక్యంతో దూసుకు వచ్చారు. రౌండ్రౌండ్కు ఆధిక్యం పెంచుకుంటూ చివరకు విజయబావుటా ఎగురవేశారు. చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం.. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ చదవండి: కాంగ్రెస్కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?' -
నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గురుమూర్తి ఘన విజయం సాధించిన సాంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురు మూర్తికి అభినందనలు తెలిపారు. ఇది ప్రజల విజయం అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘23 నెలల పాలన తర్వాత తిరుపతి పార్లమెంట్కు జరిగిన ఉపఎన్నికలో ప్రజలు మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తిరుపతి పార్లమెంట్ ఓటర్లు 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజార్టీతో దీవించారు. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మనసారా దీవించి.. నన్ను, మన ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రోజు 2.71 లక్షల మెజార్టీతో ఆశీర్వదించారు. వారు మనపై చూపించిన అభిమానం, గౌరవం ఎంతో గొప్పది. ఈ విజయం నా బాధ్యతను మరింతగా పెంచుతుంది. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతోనే ..ఈ విజయం సాధ్యమైంది అని సీఎం జగన్ తెలిపారు. చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: ఓట్ల సునామీ.. సామాన్యుడిదే గెలుపు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
‘పీవోకే’ భారత్లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
T20 WC: సంజూ వద్దు.. పంత్ బెటర్!.. తుదిజట్టులో ఆడించినా..
డీజిల్తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
మెహరీన్పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
Anchor Sreemukhi: ప్లాటినమ్ కలర్ శారీలో ‘రాములమ్మ’ హొయలు.. జింగ్ జింగ్ అమేజింగ్ శ్రీ!
తప్పక చదవండి
- సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement