రిక్షా కార్మికుడికి ప్రధాని మోదీ సర్‌ప్రైజ్‌

Published on Tue, 02/18/2020 - 12:57

లక్నో: వారణాసి పర్యటనలో భాగంగా ఈ నెల 16న ఓ రిక్షా కార్మికుడిని ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ రిక్షా కార్మికుడేవరో కాదు.. ఇటీవలే తన బిడ్డ వివాహానికి హాజరు కావాలని మోదీకి పెళ్లి పత్రిక పంపిన మంగల్‌ కేవత్‌. అయితే మోదీకి ఆ ఆహ్వానం అందడంతో.. పెళ్లి కుమార్తెకు ఆశీస్సులు తెలుపుతూ ప్రధాని.. కేవత్‌కు లేఖ రాశాడు. ఈ క్రమంలో వారణాసి పర్యటకు వచ్చిన మోదీ తానే స్వయంగా కేవత్‌ను పిలిపించుకుని.. అతని యోగక్షేమాలు అడిగారు. ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు మోదీ.

ఈ సందర్భంగా మంగల్‌ కేవత్‌ మాట్లాడుతూ.. తన కుమార్తె పెళ్లి సందర్భంగా మొదటి ఆహ్వానాన్ని ప్రధాని మోదీకి పంపాను. ఢిల్లీలోని పీఎంవో కార్యాలయంలో ఫిబ్రవరి 8వ తేదీన తానే స్వయంగా పెళ్లి పత్రికను ఇచ్చాను. ఆ తర్వాత మోదీ నుంచి ఆశీస్సులు తెలుపుతూ లేఖ వచ్చింది. లేఖను చూసిన వెంటనే తాము ఎంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యాము అని కేవత్‌ తెలిపాడు. అయితే కేవత్‌ గంగా నది భక్తుడు. తనకు వచ్చిన ఆదాయంలో కొంత గంగా ప్రక్షాళన కోసం ఖర్చు పెట్టడం విశేషం. ఇక కేవత్‌ నివాసముంటున్న డోమ్రి గ్రామాన్ని నరేంద్ర మోదీ దత్తత తీసుకున్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ