amp pages | Sakshi

మురికివాడలో పుట్టి.. సత్తా చాటి..

Published on Sat, 06/21/2014 - 05:59

ముంబై కవలల ఘనత
 ముంబై: మురికివాడల్లో పుట్టినా చదువులో మేటి అనిపించుకున్నారు ఈ ముంబై కవలలు. బస్ డ్రైవర్ కుమారులు ఇద్దరూ ఒకేసారి ప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈలో ఉత్తీర్ణత సాధించారు. గురువారం ప్రకటించిన ఐఐటీ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ముంబైకి చెందిన బస్ డ్రైవర్ రామశంకర్ యాదవ్ కుమారులైన రామ్ ఓబీసీ కేటగిరీలో 267వ ర్యాంకు దక్కించుకోగా.. అతని కవల సోదరుడు శ్యామ్ అదే విభాగంలో 1,816వ ర్యాంకు సాధించాడు. ముంబైలోని భివండీ ప్రాంతంలోని ఓ మురికి వాడలో రామశంకర్ యాదవ్ కుటుంబం నివసిస్తోంది. తనకు వచ్చే రూ.8 వేల జీతంతోనే రామశంకర్ కుటుంబాన్ని పోషిస్తూ.. నలుగురు పిల్లలను చదివిస్తున్నాడు. అయితే రామ్, శ్యామ్ చదువులో చురుకైనవారు కావడంతో టెన్త్, 12వ తరగతి పరీక్షల్లో కోచింగ్ లేకుండానే మంచి మార్కులు సాధించారు.
 
 అయితే ఎఫ్‌ఐఐటీజేఈఈ పెట్టిన ఆప్టిట్యూడ్ పరీక్షలో పాస్ కావడంతో జేఈఈకి ఉచితంగా కోచింగ్ సంపాదించారు. అయితే, ఐఐటీ ప్రవేక్ష పరీక్ష పాస్ కావడంతో ఈ కుటుంబానికి కష్టాలు తీరిపోలేదు. ఇప్పుడు వీరిద్దరినీ ఐఐటీల్లో చేర్పించడం ఆ తండ్రికి తలకు మించిన భారంగా మారింది. ఐఐటీలో చేర్చాలంటే లక్షల్లో ఫీజులు చెల్లించాలి. అది కూడా ఇద్దరికీ ఒకేసారి కట్టాలి. తన కుమారులు కష్టపడి చదువుతారని, అయితే వారి భవిష్యత్తు ప్రణాళికలకు ఏ విధంగా సహాయపడాలో అర్థం కావడం లేదని, అన్ని త్వరలోనే సర్దుకుంటాయని రామశంకర్ ఆశాభావంతో ఉన్నాడు.
 
 అతి చిన్న వయసులోనే...!
 పాట్నా: బీహార్‌కు చెందిన శివానంద్ తివారీ 14 ఏళ్లకే ప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన విద్యార్థిగా రికార్డు సృష్టించాడు. గురువారం విడుదల చేసిన ఐఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తివారీ 2,587వ ర్యాంకు సాధించాడు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని మరీ శివానంద్ తివారీ తొలిసారి పరీక్షకు హాజరుకావడమే కాక ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. బీహార్‌లోని రోహ్తాస్ జిల్లా ధరమ్‌పుర శివానంద్ తివారీ స్వస్థలం.
 
  సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన తివారీ ఇప్పుడు ఐఐటీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించినా.. మొదటగా మత ప్రబోధకుడు కావాలనుకున్నాడు. 2011లో పాట్నా, ఢిల్లీలో బ్రాంచ్‌లున్న నారాయణ ఐఐటీ-పీఎంటీ అకాడమీ డెరైక్టర్ యూపీ సింగ్.. శివానంద్ తివారీ ప్రతిభను గుర్తించాడు. అతని తండ్రి కమల్‌కాంత్‌ను ఒప్పించి శివానంద్‌ను ఢిల్లీ తీసుకువెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇదే క్రమంలో స్కూల్ స్టడీస్‌ను విజయవంతంగా పూర్తి చేసిన శివానంద్.. ఈ ఏడాది 93.4 శాతం మార్కులతో 12వ తరగతి పాస్ అయ్యాడు. దానితో పాటే ఐఐటీ శిక్షణ కూడా తీసుకున్నాడు.

Videos

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

జనసేనపై పవన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మద్యం ధ్వంసం

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు

మహాసేన రాజేష్ కు ఘోర అవమానం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)