మెట్రోకు ‘ప్లాట్‌ఫాం’ కష్టాలు..!

Published on Sun, 06/22/2014 - 22:38

సాక్షి, ముంబై: మెట్రో ప్రయాణికులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇకపై ఘాట్కోపర్ మెట్రో స్టేషన్ మెయిన్ గేట్‌కు వెళ్లాలంటే ప్రయాణికులు తప్పనిసరిగా ప్లాట్‌ఫాం టికెట్ కొనాల్సి ఉంటుంది. మెట్రో ప్రయాణికులు ఘాట్కోపర్ స్టేషన్‌కు వెళ్లాలంటే సెంట్రల్ రైల్వేకు చెందిన ఘాట్కోపర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా స్టేషన్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది.
 
అయితే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి సెంట్రల్ రైల్వేకి చెందినది కావడంతో మెట్రో ప్రయాణికులు ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.  ఈ సందర్భంగా సెంట్రల్ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ... ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై అకస్మాత్తుగా మెట్రో ప్రయాణికుల వల్ల రద్దీ పెరిగిపోవడంతో లోకల్ రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో తమ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగిస్తున్న మెట్రో ప్రయాణికులు ఇక మీదట ఫ్లాట్‌ఫాం టికెట్ చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో వారంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో టికెట్ విండో, ఏటీవీఎంలను ఏర్పాటుచేసేందుకు యోచిస్తున్నామన్నారు.
 
కాగా మెట్రో ప్రారంభంలో సెంట్రల్ రైల్వే మెట్రో ప్రయాణికులకు తమ పరిధిలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించుకునేందుకు అనుమతించింది. కానీ ఇప్పుడు మెట్రో ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించుకోవాలంటే ప్లాట్‌ఫాం టికెట్, లేదా రైల్వే పాస్ తప్పనిసరి చేశారు. ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోకుంటే మెట్రో ప్రయాణికులకు జరిమానా విధించనున్నట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ తెలిపారు.  రైల్వే ప్రవాసీ సంఘ్ అధ్యక్షుడు సుభాష్ గుప్తా మాట్లాడుతూ... ఈ విషయమై రైల్వే అధికారులతో త్వరలోనే  మాట్లాడతానన్నారు.
 
సెంట్రల్ రైల్వే పరిధిలోని ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి అదనంగా వేల సంఖ్యలో ప్రయాణికుల భారాన్ని మోయలేదని అభిప్రాయపడ్డారు. మెట్రో సేవలు ప్రారంభం కావడంతో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరిగిందని ఆయన తెలిపారు. 

Videos

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)