హైకోర్టును ఆశ్రయిస్తే రూ.10 వేల ఫైన్‌!

Published on Wed, 06/03/2020 - 16:05

చండీగఢ్‌: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట రక్షణ కల్పించాలని పంజాబ్‌, హరియాణ హైకోర్టును మంగళవారం ఆశ్రయించగా.. వారికి అనూహ్యంగా రూ.10 వేల జరిమానా పడింది. పెళ్లి ఫొటోల్లో నూతన వధూవరులు, వివాహానికి హాజరైన బంధువులు ముఖానికి మాస్క్‌లు ధరించక పోవడాన్ని కోర్టు గమనించింది. కోవిడ్‌ నిబంధనల్ని పాటించనందుకు వారికి పెనాల్టీ విధిస్తున్నట్టు న్యాయమూర్తి హరిపాల్‌ వర్మ తెలిపారు. 15 రోజుల్లో జరిమానా మొత్తాన్ని హోషియాపూర్‌ డీసీకి అందజేయాలని ఆదేశించారు.

ఆ మొత్తాన్ని హోషియాపూర్‌లో మాస్కుల పంపిణీకి వెచ్చించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దాంతోపాటు.. నూతన వధూవరుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని గురదాస్‌పూర్‌ ఎస్‌ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, అనూహ్యంగా తమకు జరిమానా పండటంతో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తొలుత ఆందోళన చెందారు. అయితే, కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎస్‌ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు.
(చదవండి: చిన్న అబద్ధం, పెద్ద శిక్ష పడే అవకాశం!)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ