ఎంగేజ్మెంట్ రోజు బీఎండబ్ల్యూలో వెళ్లగా..!

Published on Sun, 09/04/2016 - 13:33

ప్రియురాలితో మరికొన్ని గంటల్లో ఎంగేజ్ మెంట్ జరుగుతుందనగా అదే రోజు ఓ యువ పారిశ్రామికవేత్త దుర్మరణం పాలయ్యాడు. సెంట్రల్ ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఇవ్వడానికి వెళ్లిన అభిజిత్ సింగ్.. శనివారం ఉదయం ఇంటికి తిరుగు ప్రయాణం కాగా దారి మధ్యలోనే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

మద్యం సేవించిన అభిజిత్ అతివేగంతో వాహనం(బీఎండబ్ల్యూ) నడపటంతో అది అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఇది గమనించిన ఓ వ్యక్తి అభిజిత్ను కారు నుంచి బయటకు లాగి దగ్గర్లోకి ఆస్పత్రిలో చేర్చాడు. తీవ్రగాయాలపాలైన ఆ యువ వ్యాపారవేత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు ప్రధాన అవయవాలు దెబ్బతినడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు.

అభిజిత్ మరణంతో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది. నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉన్న అతడి తండ్రి బయటకు వెళ్లొద్దని వారిస్తున్నా.. ఫ్రెండ్స్కు పార్టీ ఇవ్వాలంటూ అభిజత్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు వివరించారు. ప్రమాదంలో బీఎండబ్ల్యూ దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. అభిజిత్ ఇంటికి పెద్దకొడుకు కాగా, అతడికి 18 ఏళ్ల సోదరుడు ఉన్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.       

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ