amp pages | Sakshi

‘జలరవాణా’తో అవకాశాలు

Published on Fri, 04/15/2016 - 00:49

కొత్త ప్రాజెక్టులతో కోటిమందికి ఉపాధి
♦ మారిటైమ్ సదస్సులో ప్రధాని మోదీ
 
 ముంబై: దేశంలోని జలరవాణా అభివృద్ధి, అనుసంధానానికి కేంద్రం కట్టుబడి ఉందని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధాని నరేంద్రమోదీ గురువారం పిలుపునిచ్చారు. ముంబైలో మొదటి మారిటైమ్ ఇండియా సమిట్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ... ఓడరేవుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు సేకరించాలని నిర్ణయించామని చెప్పారు. సముద్రతీర ప్రాంత అభివృద్ధికి ఇదే సరైన సమయమన్నారు. ఓడరేవుల సామర్థ్యాన్ని 2025 నాటికి 140 కోట్ల టన్నుల నుంచి 300 కోట్ల టన్నులకు పెంచడమే లక్ష్యమని చెప్పారు. ఎగుమతి, దిగుమతుల సామర్థ్యాన్ని అందుకునేందుకు ఐదు కొత్త ఓడరేవుల్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. భారతీయ నౌకా పరిశ్రమ అభివృద్ధి కోసం సుదీర్ఘ కసరత్తుకు కట్టుబడి ఉన్నామని, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని జారవిడుచుకోవ ద్దని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కరే... దేశ జల, నదీ రవాణా విధానానికి రూపకర్తని చెప్పారు.

 10 ఏళ్లలో కోటిమందికి ఉపాధి
 మారిటైమ్ విభాగంలో 250 ప్రాజెక్టుల్లో పెట్టుబడుల కోసం నౌకాయాన శాఖ ఆహ్వానిస్తోందని తెలిపారు. 12 ప్రధాన ఓడరేవుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. వీటిలోని 100 ప్రాజెక్టులు సాగరమాల పథకంలో భాగంగా నిర్మిస్తారని మోదీ వెల్లడించారు. ఇవి అమలైతే కోటి మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు.సాగరమాలకు సంబంధించి జాతీయ విధానాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారీ మాట్లాడుతూ.. పోర్టుల అభివృద్ధికి ఉద్దేశించిన సాగరమాల ప్రాజెక్టు కాలపరిమితిని పదేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

 ఈనామ్ ఆవిష్కరణ
 ఢిల్లీలో జరిగిన మరో కార్యక్రమంలో జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ (ఈనామ్)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిద్వారా ప్రస్తుతానికి తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాల్లోని 21 మార్కెట్లను అనుసంధానిస్తారు.

Videos

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)