‘రాజీవ్‌ క్రూరుడే’

Published on Mon, 05/06/2019 - 12:03

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) జాతీయ ప్రతినిధి మజీందర్‌ సింగ్‌ సిర్సా తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రాజీవ్‌ దేశంలోనే అతిపెద్ద మూకహత్యలకు పాల్పడిన క్రూరుడని వ్యాఖ్యానించారు. రాజీవ్‌ను నెంబర్‌వన్‌ అవినీతిపరుడిగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించారు. ఓ వర్గానికి వ్యతిరేకంగా మూక హత్యలను ప్రేరేపించిన ప్రధానిగా రాజీవ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు.

ప్రధాని మోదీ చెప్పినట్టుగా రాజీవ్‌ అవినీతిలో అగ్రగణ్యుడే కాకుండా అతిపెద్ద మూకహత్యల ప్రేరేపకుడు కూడా అని ఆరోపించారు. సిక్కుల ఊచకోతను రాజీవ్‌ ప్రోత్సహించారని సిర్సా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా దేశం కోసం ప్రాణాలర్పించిన దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎప్పుడో మరణించిన రాజీవ్‌పై ప్రధాని తాజా వ్యాఖ్యలు అమానవీయమని విపక్షాలు భగ్గుమన్నాయి.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ