బీఫ్ తరలిస్తున్న వాహనానికి నిప్పు

Published on Tue, 10/06/2015 - 16:40

ముంబై : మహారాష్ట్రలో బీఫ్ నిషేధం వివాదం రోజురోజుకు ఉధృత రూపం దాలుస్తోంది.  బీఫ్ ను తరలిస్తున్న వ్యాన్ కు నిప్పు పెట్టిన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. అహ్మద్‌నగర్ నుంచి ఔరంగాబాద్‌కు బీఫ్‌ను తరలిస్తుండగా సావ్‌ఖేడా గ్రామం వద్ద కొంత మంది వ్యాన్‌ను ఆపి డ్రైవర్‌తో గొడవకు దిగారు.  ఆ తర్వాత వాహనానికి నిప్పుపెట్టారు. 

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వ్యాన్‌లో  బీఫ్ తరలిస్తున్న విషయాన్ని  నిర్ధారించారు. సుమారు వంద కేజీల మాంసాన్ని తరలిస్తున్నట్టుగా ఔరంగాబాద్ ఎస్పీ నవీన్ చంద్ర రెడ్డి  తెలిపారు. అయితే   వ్యాన్  పాక్షికంగా తగులబడిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఇటూ బీఫ్ రవాణాపై నిషేధం ఉన్న నేపథ్యంలో అక్రమంగా బీఫ్‌ను తరలిస్తున్న డ్రైవర్‌పై, నిప్పు పెట్టిన ఆందోళనకారులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ