రిటైర్డ్ ఉద్యోగుల మీద ఎందుకీ వివక్ష?

Published on Thu, 07/23/2015 - 00:08

ఆరు దశాబ్దాల కృషితో ఏర్పడింది ప్రత్యేక తెలంగాణ. ఇందుకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, రైతులు తమ వంతు కృషి చేశారు. రెండున్నర లక్షల మంది విశ్రాంత ఉద్యోగులు కూడా ఈ ఉద్యమంలో భుజం భుజం కలిపారు. ఇందుకు వీరు ఎంతో ఆనందిస్తున్నారు. బంగారు తెలంగాణలో మిగిలిన అన్ని వర్గాలతో పాటు పదవీ విరమణ చేసిన వారి ఆకాంక్షలు కూడా నెరవేరతాయని ఆశించారు. కొన్ని వర్గాల ఉద్యోగులు, వర్గాల వారి కలలు నెరవేరాయి కూడా. కానీ రెండున్నర లక్షల మంది విశ్రాంత ఉద్యోగుల పట్ల మాత్రం కె. చంద్రశేఖరరావు ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించకపోవడం వీరిని హతాశులను చేసింది.

పదవీ విరమణ చేసిన నాటికి ఉద్యోగి తీసుకుంటున్న వేతనంలో సగం పింఛనుగా చెల్లించే విషయం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో మొదలైన వివాదం నేటికీ కొనసాగడం విశ్రాంత ఉద్యోగులను మరింత కుంగదీస్తోంది. మే 25, 1998 తరువాత పదవీ విరమణ చేసిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ తేదీకి ముందు పదవీ విరమణ చేసిన వారికీ ఆ నిబంధన వర్తింపచేయాలని పదవీ విరమణ ఉద్యోగులు కోరుతున్నారు. దీనిని కూడా అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. తరువాత విశ్రాంత ఉద్యోగులు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళితే, వీరి డిమాండ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వం మళ్లీ ఈ తీర్పునకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు కూడా ట్రిబ్యునల్ తీర్పునే సమర్థించింది.

కానీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2004లో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. పదేళ్ల తరువాత 2014 ఏప్రిల్ 30న సుప్రీంకోర్టు కూడా రిటైర్డ్ ఉద్యోగులకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. అప్పటికే విభజన ప్రక్రియ ప్రారంభం కావడంతో గవర్నర్‌కు రిటైర్డ్ ఉద్యోగులు ఈ అంశం గురించి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సుప్రీం తీర్పును వెంటనే అమలు చేయాలని కూడా కోరడం జరిగింది. ‘ఎంప్లాయీ ఫ్రెండ్లీ తెలంగాణ ప్రభుత్వం’ ఎనిమిది మాసాలైనా ఇప్పటికీ సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసే అంశం మీద జీవో జారీ చేయలేదు. సరికదా, సర్వీసు ఉద్యోగులకు ఇచ్చిన తెలంగాణ ఇంక్రిమెంట్‌ను రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వలేదు. ఇది విశ్రాంత ఉద్యోగులను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నది.

దీనితో పాటు పన్నెండు మాసాలు గడచిపోయినప్పటికీ పదో పీఆర్‌సీ సిఫారసుల అమలు కోసం కూడా ఈ వర్గం ఇప్పటికీ ఎదురు చూడవలసి వస్తున్నది. ఆ పది మాసాల బకాయిల చెల్లింపు ఏ విధంగా జరుగుతుందో కూడా తెలియడం లేదు. అడిషినల్ క్వాంటమ్ మీద పీఆర్‌సీ సిఫారసులను ఆమోదించాలన్న తమ విన్నపం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా అర్థం కావడం లేదు. హెల్త్ కార్డుల విషయం కూడా ఇప్పటికీ తేలలేదు. ఈ సమస్యలను పరిష్కరించి రిటైర్డ్ ఉద్యోగుల క్షోభను నివారించాలని కేసీఆర్‌ను కోరుతున్నాం. పడాల రాములు  (జీటీఈఏ మాజీ ఉపాధ్యక్షులు) హైదరాబాద్
 
‘పోలీస్’ సంస్కరణలు ఎక్కడ?
మితిమీరిన రాజకీయ జోక్యం, పై అధికారుల ఇష్టా రాజ్య ధోరణి పోలీస్ వ్యవస్థను అభాసుపాలు చేస్తు న్నాయి. ప్రజలకూ, పోలీసులకూ మధ్య పెరుగు తున్న అంతరం మరింత విస్తరించకుండా 30 ఏళ్ల క్రితం తలపెట్టిన సంస్కరణలను అమలు చేయడం అవసరం. రెబీరో కమిషన్, మాలిమత్ కమిషన్, ధర్మ వీర్ కమిషన్, పద్మనాభయ్య కమిషన్ వంటివి అం దుకు సిఫారసులు చేశాయి. 2008లో పార్లమెంటు కూడా పోలీసు సంస్కరణల గురించి చర్చించింది. సుప్రీం కోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. అరెస్టు అధికారాన్ని పోలీసుల నుంచి నియంత్రించడం, కేసు లతో నష్టపోతే పరిహారం వంటివి ఇందులో ఉన్నా యి. వీడియో కాన్ఫరెన్స్‌తో కేసుల సత్వర పరిష్కారం కోసం కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది. 1970లో ఏర్పాటైన జాతీయ పోలీస్ కమిషన్ అనేక నివేదికలు సమర్పించింది. అయినా ఇప్పటికీ ఈ వ్యవస్థను సం స్కరించవలసిన అవసరమే ఎక్కువ. పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగేటట్టు చేయాలి. ఇది ప్రజాస్వామ్య విజయానికి అవసరం.  ముర్కి రామచంద్రం  కోహెడ, కరీంనగర్ జిల్లా.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)