అంతరిక్ష విజయం

Published on Sat, 12/20/2014 - 00:48

 భారత అంతరిక్ష పరిశోధనల చరిత్రలో మరో మైలురాయి. ఇన్నా ళ్లుగా మానవరహిత ఉపగ్రహాల ప్రయోగంలో అద్భుత విజయా లను సాధించిన భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మరో ముందంజ వేసింది. అంతరిక్షంలోకి మానవులను పంపే దిశగా తొలి అడుగులు వేశాం. గురువారం శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వి-మార్క్ 3 రాకెట్, భారత శాస్త్రజ్ఞుల సాంకేతిక విన్నాణాన్ని నిరూపి స్తూ నింగిలోకి దూసుకెళ్లింది. 3,735 కిలోల బరు వు ఉన్న వ్యోమగామి మాడ్యూల్‌ను సురక్షితంగా భూమికి తీసుకురావడం ద్వారా భారతీయ వ్యోమ గాములు త్వరలో అంతరిక్షంలోకి అడుగుపెట్టగలరనే ఆశను జాతికి అందించింది.
 
 కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మరో పదేళ్ల లోనే మానవులను అంతరిక్షంలోకి పంపగలమనే తొలి సంకేతా లను ఇస్రో ఈ ప్రయోగం ద్వారా పంపించింది. మానవులను అంతరిక్షంలోకి పంపగలిగే నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందే అరుదైన అవకాశం మరెంతో దూరంలో లేదు. ఈ విజ యంతో భారీ కమ్యూనికేషన్ ఉప్రగహాలను భారత్ ప్రయోగించగలదు. ఇస్రో శాస్త్రజ్ఞులకు అభివందనలు.
 సృజన  మాదాపూర్, హైదరాబాద్

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ