వండిపెడుతూ చదువుకున్న వట్టికోట

Published on Mon, 01/30/2017 - 00:12

వట్టికోట ఆళ్వారుస్వామి(1915)లో నల్లగొండ జిల్లా చెరువుమాదారం గ్రామంలో జన్మించారు. చిన్నప్పుడే ఆయన తండ్రి చనిపోయాడు. మూడు శాతం అక్షరాస్యత మాత్రమే వున్న ఆ కాలంలో ఒక ఉపాధ్యాయునికి వండిపెడుతూ క్రమంగా అక్షరజ్ఞానం సంపాదించారు. చదువు నేర్చుకోవటానికే విజయవాడ వెల్‌కమ్‌ హోటల్‌లో సర్వర్‌గా పనిచేశారు. పదిహేను రూపాయల నెలజీతంలో సగం వెచ్చించి ఒక ట్యూషన్‌ మాష్టారు దగ్గర ఇంగ్లీష్‌ నేర్చుకున్నారు.

1938లో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించారు. సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, కాళోజీ వంటి గొప్ప రచయితలతో జ్ఞానదాయకమైన పుస్తకాలు రాయించారు. వాటిని ప్రచురించి, స్వయంగా ఊరూరు తిరుగుతూ సామాన్యులకు పుస్తకాలను అందించారు.  నిజాం నిరంకుశపు రోజుల్లో సుమారు 40 పుస్తకాలను ప్రచురించి పంపిణీ చేయటం చిన్న విషయం కాదు.
సేకరణ: అమ్మంగి వేణుగోపాల్‌
9441054637

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ