amp pages | Sakshi

23న చంద్రబాబు దిగిపోవడం ఖాయం

Published on Tue, 05/07/2019 - 04:45

సాక్షి, అమరావతి: సీఎం పీఠం నుంచి ఈ నెల 23 తర్వాత చంద్రబాబు దిగిపోవడం ఖాయం.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. అందుకే  కేబినెట్‌ 10వ తేదీన నిర్వహిస్తామని అంటున్నారు.. ఓటమి భయం పట్టుకోవడంతో చంద్రబాబు చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారు.. అంటూ వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సోమవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాబోయే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే కేబినెట్‌ మీటింగ్‌ అంటూ హడావుడి చేస్తున్నారు. ఈ నెల 23 తర్వాత చంద్రబాబు జీవితాంతం కేబినెట్‌ సమావేశం నిర్వహించలేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. తన ఓటమిని ఎన్నికల కమిషన్‌ (ఈసీ), ఈవీఎంలపై నేట్టే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నూటికి నూరుపాళ్లు టీడీపీ అధికారం కోల్పోతుంది. ప్రజలంతా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావాలన్న నిర్ణయంతో ఓట్లు వేశారని మే 23వ తేదీ తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అన్నారు. టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్నాడని ఇంటిలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంటకేశ్వరరావుపై ఫిర్యాదు చేస్తే... చంద్రబాబు చిందులు తొక్కారన్నారు. 

అప్పటి నీ మాటలు గుర్తుకు తెచ్చుకో ‘బాబు’  
ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, అధికారులు అందరూ ఎన్నికల కమిషన్‌ పరిధిలోనే ఉండాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పట్లో చెప్పిన ఆయన ఇప్పుడు సీఎంగా ఉంటే చట్టాలు, నియమాలు మారిపోతాయా? అని ప్రశ్నించారు. 

ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఏపీపీఎస్సీ... 
ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగా ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 పరీక్షలో ఓటర్లను ప్రభావితం చేసేలా టీడీపీ, చంద్రబాబు చుట్టూ తిరిగే ప్రశ్నలను అడిగారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీళ్లిస్తానని ఇవ్వకుండా ఇప్పుడు ప్రాజెక్టును సందర్శించి సమీక్షలు చేసే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 

ఎన్నికల సంఘంలోనే టీడీపీ కోవర్టులు: నాగిరెడ్డి 
దేశ చరిత్రలో ఎవరూ ఉల్లంఘించనన్ని ఉల్లంఘనలు ఈ ఎన్నికల్లో బాబు పాల్పడ్డారని నాగిరెడ్డి విమర్శించారు. ఎన్నికల కమిషన్‌లోనే టీడీపీ కోవర్టులను చొప్పించారని, వారు అధికార పార్టీకి సమాచారం చేరవేస్తున్నారని ఆరోపించారు. 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)