రేవంత్‌ వ్యాఖ్యలపై మౌనం ఎందుకు?

Published on Fri, 10/20/2017 - 13:14

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు వ్యాఖ్యానించారు.  చంద్రబాబు విదేశీ పర్యటనలు అన్నీ వ్యక్తిగత పర్యటనలేనని ధ్వజమెత్తారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో శుక్రవారం  వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు  మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌,సోమినాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా అనే పరిస్థితులు నెలకొన్నాయని వారు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌ ...టీడీపీకి ఎన్నికల ప్రాజెక్ట్‌గా మారిపోయిందని విమర్శించారు. కమీషన్ల కోసమే ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చుతోందని అన్నారు. 2018కి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని, చంద్రబాబు ప్రకటించినా, ఇప్పటికీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.

టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు...
రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు సూటిగా ప్రశ్నించారు. ‘రేవంత్‌ చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చే దమ్ము, ధైర్యం టీడీపీ నేతలకు ఉందా?. ఓటుకు కోట్లు కేసులో సూత్రధారులెవరో రేవంత్‌ ప్రజలకు చెప్పాలి. దేవినేని ఉమ తాను మంత్రి అన్న సంగతి మరిచిపోయి ఆరోపణలు చేస్తున్నారు. ఉమ ఇసుక మాఫియా కింగ్‌ అని ఎవరినడిగినా చెబుతారు. ప్రశ్నించినందుకు వైఎస్‌ఆర్‌ సీపీపై అబద్ధాలతో కూడిన ఎదురుదాడికి దిగుతున్నారు.’ అని అన్నారు.  ఏపీలో మంత్రులుగా ఉంటూ ...మరోవైపు కేసీఆర్‌తో కుమ్మక్కు అయింది వాస్తవం కాదా? సీఎం రమేష్‌, యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సుధాకర్‌ యాదవ్‌కు ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌లు ఇచ్చింది నిజం కాదా?. ఏపీ ఆర్థిక పరిస్థితి, పోలవరం, అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్‌ చేశారు.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)