చంద్రబాబు కనుసన్నల్లో రమేష్‌ కుమార్‌.. 

Published on Sun, 03/15/2020 - 16:31

సాక్షి, ఒంగోలు: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా ఒక కుట్ర అని మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదని, ఎన్నికల కమిషన్‌ నిర్ణయం వల్ల 14వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని మంత్రి బాలినేని అన్నారు. (ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా)

ఎన్నికల కమిషనర్‌ ...చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నారనే అనుమానాలు బలపడ్డాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి సీఎం జగన్‌ ...ఎన్నికల కమిషనర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని కోరారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించే వ్యక్తిని కమిషనర్‌గా నియమించాలని మంత్రి బాలినేని డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. (రాష్ట్ర ఎన్నికల కమిషనర్పై సీఎం జగన్ ఆగ్రహం)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ