amp pages | Sakshi

‘కల్వకుంట్ల రాజ్యాంగం చెల్లదు’

Published on Fri, 06/07/2019 - 02:57

హైదరాబాద్‌: కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేల విలీనం లేఖపై ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాం గం చెల్లుతుందే గానీ కల్వకుంట్ల రాజ్యాంగం చెల్లదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరిలో గురువారం ఆయన పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రగతిభవన్‌ను సీఎం అధికారికంగా ఉపయోగిస్తున్నప్పుడు కేటీఆర్‌ అక్కడ ఉండటమే తప్పన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ విందుకు ఆహ్వానించడం అధికార దుర్వినియోగమేనన్నారు. కేసీఆర్‌కు 88 ఎమ్మెల్యే సీట్లనిచ్చి గెలిపించారని అయితే ఆయన అభివృద్ధిపై కాకుండా ఫిరాయింపులపై దృష్టి సారిస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 70ఏళ్లలో పలు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు లేకుండా పాలన సాగించలేకపోయాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఫిరా యింపు చేయని వారినే గెలిపించారన్నారు. నిజామాబాద్, కరీంనగర్‌లో కర్రు కాల్చి ప్రజలు వాతపెట్టారని ఆ ఓటమి నుంచి టీఆర్‌ఎస్‌ పాఠాలు నేర్చుకోవాలన్నారు.

ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలి: పొన్నం 
కాంగ్రెస్‌ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్‌ కొనుగోలు చేయడం సిగ్గుచేటని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఒక దళితుడు ప్రతిపక్ష నేతగా ఉండడాన్ని జీర్ణించుకోలేని టీఆర్‌ఎస్, ప్రతిపక్షం లేకుండా చేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోర్టులో అనర్హత పిటిషన్‌ పెండింగ్‌లో ఉండ గా విలీన ప్రక్రియ ప్రయత్నాలు చేయడమేమిటని ప్రశ్నించారు. దీనిపై మా ఎమ్మెల్యేలు నిరసనలు చేస్తే అరెస్టు చేసి కేసులు పెడతారా అని నిలదీశారు. గతంలో మేము చేసిన అనేక ఫిర్యాదులపై ఇప్పటివరకు స్పీకర్‌ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
ఎవరు పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి: విజయశాంతి  

 వేసే ఓట్లు ఏమౌతున్నాయో, ఓట్లు వేశాక గెలిచే అభ్యర్థులు ఎటు పోతారో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానీకం సతమతమవుతూ ఉందని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. గెలిచాక ఈ అభ్యర్థి మన పార్టీలోఉంటారా..? అనే కార్యకర్తల ఆవేదనకు సమాధానం చెప్పలేని స్థితిలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.   

విలీనంపై సుప్రీంని ఆశ్రయిస్తాం: కుసుమ కుమార్‌(టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్‌)
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా చంపేశారని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్‌ విమర్శించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేకుండా 12 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా సీఎల్పీ విలీన లేఖను స్పీకర్‌ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ అప్రజాస్వామిక విధానాలపై సుప్రీంకోర్టుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. 

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)