కేసీఆర్‌కు థర్డ్‌ ఫ్రంట్‌ అర్హత లేదు

Published on Fri, 03/09/2018 - 16:24

సాక్షి, పెద్దపల్లి: దేశంలో భారతీయ జనతా పార్టీ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరిగిన సీపీఐ 2వ మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విగ్రహాల విధ్వంస చర్యలను బీజేపీ, సంఘ్‌ పరివార్‌ శక్తులు మానుకోవాలన్నారు. ప్రజాస్వామ్య విలువలను మోదీ సర్కార్‌ పాతరేస్తోందని మండిపడ్డారు. నల్లధనాన్ని వెలికితీయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. బొగ్గు బావుల ప్రైవేటీకరణను కేంద్రం రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

మరో వైపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూల్చి వేస్తున్న కేసీఆర్‌కు థర్డ్‌ ఫ్రంట్‌ పెట్టె అర్హత లేదన్నారు. మార్చి 11 న జరగబోయే మిలియన్‌ మార్చ్‌ స్పూర్తి యాత్రను అడ్డుకోవడానికి సీపీఐ కార్యకర్తలను నిర్భంధించడం సరైనది కాదన్నారు. ప్రజాస్వామ్య , లౌకిక, వామపక్ష విశాల వేదికకు సీపీఐ కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ