amp pages | Sakshi

కాంగ్రెస్‌ నేతకు ఐఏఎస్‌ లీకులు?

Published on Wed, 06/27/2018 - 00:51

సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్‌: తమకు ప్రాధాన్యం కలిగిన పోస్టులివ్వడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న కొందరు ఐఏఎస్‌ అధికారులు ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సన్నిహితంగా ఉండే ఓ కాంగ్రెస్‌ నేతతో సమావేశం కావడం రాజకీయ, అధికార వర్గాల్లో సంచలనం రేపుతోంది! గడచిన రెండేళ్లుగా తెలంగాణలో తమ వర్గం ఐఏఎస్‌ అధికారులకు సరైన పోస్టులు దక్కకుండా ఓ ప్రభుత్వ సలహాదారు అడ్డుపడుతున్నారని వీరంతా ఆగ్రహంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకువెళ్లేందుకు వీరు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ముఖ్యమంత్రిని కలవకుండా ఆ సలహాదారు అడ్డుకుంటున్నారని వీరు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యం లేకుండా పోతోందని భావించిన ఈ వర్గం ఐఏఎస్‌ అధికారులు తమకు సన్నిహితుడైన ఓ కాంగ్రెస్‌ నేతతో ఇటీవల సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తమకు సరైన ప్రాధాన్యం లభించడం లేదన్నది వీరి సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం. రాహుల్‌కు సన్నిహితుడైన సదరు కాంగ్రెస్‌ నేత పనిలో పనిగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వీలుగా ఉండే సమాచారం ఏదైనా ఉంటే ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. దీంతో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఒకరిద్దరు కాంట్రాక్టర్లకు అనుకూలంగా రూపొందించిన నిబంధనలు, మియాపూర్‌ భూకుంభకోణానికి సంబంధించిన సమాచారాన్ని వీరు అందించినట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఏయే అధికారుల పాత్ర ఉంది? వారు కాంగ్రెస్‌ నేతతో కలిసి ఏ విషయాలు చర్చించారన్న అంశంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. 

దృష్టి సారించిన కేంద్రం! 
కాంగ్రెస్‌ నేతతో సదరు ఐఏఎస్‌ అధికారులు రెండుసార్లు సమావేశమయ్యారని విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని అధికారులు భావించారు. అయితే ఆ అధికారుల బృందంలోని ఓ సభ్యుడే ఆ సమావేశం వివరాలను మరో ఐఏఎస్‌ అధికారితో పంచుకోవడంతో ఇది కాస్తా బయటకు పొక్కింది. ఆ నోటా ఈ నోటా ఇది ఢిల్లీకి చేరడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. దీనిపై ఆరా తీయాలని ఇంటెలిజెన్స్‌ బ్యూరోను ఆదేశించినట్లు సమాచారం. ఐఏఎస్‌ అధికారులు వ్యక్తిగత పరిచయాల దృష్ట్యా ఎవరితో అయినా కలిసేందుకు అభ్యంతరం ఉండదని, అయితే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతిపక్ష నేతకు ఇవ్వడం దారుణమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాతే తెలంగాణ ప్రభుత్వం ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసినట్లు చెబుతున్నారు. మరికొందరికి కూడా ఏమాత్రం ప్రాధాన్యం లేని పోస్టులు కట్టబెట్టారని ప్రచారం జరుగుతోంది. 

ఆ సలహాదారు కుట్ర చేస్తున్నారని ఆరోపణలు 
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఒకరు ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన ఐఏఎస్‌ అధికారులకు ప్రాధాన్య పోస్టులు దక్కకుండా కుట్ర చేస్తున్నారన్నది ఆ వర్గానికి చెందిన సీనియర్‌ అధికారుల ఆరోపణ. గడచిన ఏడాదిన్నరగా ఈ అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన చెందుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనూ ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన ఐఏఎస్‌ అధికారులు ఉన్నా వారిని పట్టించుకోకుండా జూనియర్‌ అధికారులను జిల్లా కలెక్టర్లుగా నియమించారని వారు ఉదాహరణలతో సహా చెబుతున్నారు. కొత్త జిల్లాల నియామకాల్లో అగ్రవర్ణాల వారికే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నది వారి ఆరోపణల్లో ప్రధానమైనది.

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఓ వర్గం వారికే ప్రాధాన్యం కలిగిన పోస్టులు లభిస్తున్నాయని, దీని వెనుక సదరు ప్రభుత్వ సలహాదారు ఉన్నారని ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్‌ అధికారులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను డమ్మీ చేసి తానే పాలనా యంత్రాంగంలో చక్రం తిప్పుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. సలహాదారు తీరును సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారు భావించారు. ‘‘మేం ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించాం. కానీ ఆ సలహాదారు మా ప్రయత్నాలను వమ్ము చేశారు. దీంతో చేసేది లేక మేం మిన్నకుండిపోయాం’’ అని ఓ అధికారి ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. 

పత్రాలు తీసుకువెళ్లారా? 
సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కొందరు కాంగ్రెస్‌ నేతతో భేటీ కావడాన్ని ప్రభుత్వం ఎప్పుడో గమనించినట్లు ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే వారిని అప్రాధాన్య పోస్టుల్లో నియమించిందని ఆ వర్గాలు చెప్పాయి. అయితే ప్రభుత్వంలో కీలక సమాచారాన్ని ఆ కాంగ్రెస్‌ నేతకు ఇచ్చారా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. కావాలనే కొన్ని పత్రాలు బయటకు తీసుకువెళ్లారని ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండే ఓ సలహాదారు చెప్పారు. ఆ పత్రాలతో కాంగ్రెస్‌ నేతలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.   

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)