amp pages | Sakshi

కేంద్రానికి వ్యతిరేకం.. కేబినెట్‌లోకి ఆహ్వానం!

Published on Thu, 01/02/2020 - 10:08

పట్నా : ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బీజేపీ మిత్రపక్షం జేడీయూను శాంతిపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగారు. జేడీయూని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ గత కొంత కాలంగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన స్వరాన్ని వినిపిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం, ఎన్‌ఆర్‌సీ, రానున్న అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు వంటి అంశాలపై జేడీయూ-బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. (బీజేపీకి ప్రశాంత్‌ కిషోర్‌ అల్టిమేటం..!)

ఈ నేపథ్యంలో జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీట్ల ఒప్పదంలో సింహభాగం తామే పోటీ చేస్తామని, బీజేపీ ప్రతిపాదనకు తలొగ్గేది లేదంటూ తేల్చి చెప్పారు. బీజేపీకి గుడ్‌బై చెప్పి విపక్షాలకు చేతులు కలిపేందుకు కూడా నితీష్‌ సిద్ధంగా ఉన్నారంటూ సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో వెంటనే తేరుకున్న మోదీ, షా ద్వయం నష్టనివారణ చర్యలను చేపట్టింది. జేడీయూని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇద్దరికి కేబినెట్‌లో చోటు దక్కనుందని సమాచారం. కాగా ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కేవలం ఒక్కరికే మంత్రిపదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 

దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నితీష్‌.. ఒక్క పదవి తమకు అవసరం లేదని తిరస్కరించారు. దీంతో మోదీ తొలి మంత్రివర్గ విస్తరణలో జేడీయూకి చోటుదక్కలేదు. ఎన్డీయే అతిపెద్ద భాగస్వామ్యపక్షం శివసేన మంత్రిమండలి నుంచి వైదొలగడం, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా నితీష్‌ గళం విప్పడం వంటి ప్రభుత్వ వ్యతిరేక పరిణామాలు చకచక జరిగిపోయాయి. మరోవైపు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు గడువు దగ్గరపడుతుండంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. జేడీయూని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అంగీకరించింది. శుక్ర, శనివారాల్లో వారుమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు