-
‘బడ్జెట్’ లోపే కేబినెట్ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపే కేబినెట్ విస్తరణ ఉండవచ్చని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో ఆరు బెర్తులు ఖాళీగా ఉండటంతో.. ఎవరెవరికి అవకాశం వస్తుందన్న దానిపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. కొత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి, అగ్రవర్ణాలకు చెందిన ఇద్దరు నేతలకు అమాత్యయోగం దక్కుతుందన్న చర్చ జరుగుతోంది. అయితే అందుబాటులో ఉన్న ఆరు పదవులను ఒకేసారి భర్తీ చేస్తారా? పలు సమీకరణాల నేపథ్యంలో ఒకట్రెండు బెర్తులు ఖాళీగా ఉంచుతారా? అన్నదానిపై స్పష్టత రావడం లేదు. వచ్చే 15 రోజుల్లోనే కేబినెట్ విస్తరణ జరిగినా ఆశ్చర్యం లేదని టీపీసీసీ నేతలు చెప్తున్నారు. ఏ కోటాలో ఎవరికి? రాష్ట్ర కేబినెట్లో సీఎం సహా మొత్తం 18 మంది అవకాశం ఉంది. ఇప్పటికే 12 మందితో రేవంత్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇందులో ఎస్టీలకు ఒకటి, బీసీలు, ఎస్సీలకు రెండు చొప్పున ఇవ్వగా, ఏడు పదవులను అగ్రవర్ణాలకు కేటాయించారు. ఇందులో రెడ్డి సామాజికవర్గానికి నాలుగు.. వెలమ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలకు ఒక్కోటి ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా విస్తరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి, ఎస్టీ కోటాలో దేవరకొండ నుంచి బాలూనాయక్లకు.. బీసీ కోటాలో మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్కుగానీ, ఎంబీసీ కోటాలో ఈర్లపల్లి శంకర్ (షాద్నగర్)కుగానీ అవకాశం రావొచ్చని అంటున్నారు. అగ్రవర్ణాలకు సంబంధించి.. రెడ్డి సామాజికవర్గం నుంచి పి.సుదర్శన్రెడ్డి (బోధన్), కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (మునుగోడు), మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం)ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మల్రెడ్డికి అసెంబ్లీలో చీఫ్విప్ హోదా ఇవ్వొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక వెలమ సామాజికవర్గ కోటాలో కె.ప్రేమ్సాగర్రావు (మంచిర్యాల), మదన్మోహన్రావు (ఎల్లారెడ్డి) పేర్లు వినిపిస్తున్నాయి. మరికొందరు నేతలూ రేసులో.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. ఆయనకు శాసనమండలిలో విప్ హోదా ఇస్తారని కూడా అంటున్నారు. అయితే వెంకట్కు మంచి హోదా కలి్పంచాలని స్వయంగా రాహుల్గాంధీ చెప్పారని.. ఈ నేపథ్యంలో ఆయనకు కేబినెట్ అవకాశం దక్కవచ్చని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తమ్మీద 15 రోజుల్లోనే, లేదా బడ్జెట్ సమావేశాల్లోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని అంటున్నాయి. మంత్రి పదవుల కోసం సామాజిక వర్గాల వారీగా మరికొందరు నేతలు, మహిళా ఎమ్మెల్యేలు కూడా పోటీలో ఉన్నారని పేర్కొంటున్నాయి. మైనార్టీ కోటాలో ఎవరికి? కేబినెట్లో మైనార్టీ కోటా కింద ఎవరిని, ఎలా ఎంపిక చేస్తారన్న దానిపై స్పష్టత రావడం లేదు. ఈసారి విస్తరణలో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులు భర్తీ చేస్తారా, నాలుగైదు మాత్రమే నింపుతారా అన్నది మైనార్టీ కోటాను బట్టే ఉంటుందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తరఫున మైనార్టీ నేతలెవరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికకాకపోవడంతో.. వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తేనే మంత్రి పదవి లభించనుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా బీసీ, ఓసీ వర్గాలకు చెందిన ఇద్దరిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. నల్లగొండ గ్రాడ్యుయేట్స్, పాలమూరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మైనార్టీలు పోటీచేసే అవకాశం లేదన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో గవర్నర్ కోటాలో మైనార్టీ నేతను శాసనమండలికి పంపి మంత్రి పదవి కేటాయించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అటు అధిష్టానం, ఇటు సీఎం రేవంత్ల మదిలో ఏముందనే దానిపై స్పష్టత లేదు. మైనార్టీ కోటాలో మంత్రిపదవి రేసులో.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ఖాన్ల పేర్లు ఉన్నాయి. ఆమేర్ అలీఖాన్, జాఫర్ జావేద్ల పేర్లు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాలో ఉండటం గమనార్హం. త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా.. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకాలను చేపట్టేందుకూ కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. విదేశ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి ఈనెల 22న ఉదయం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. తర్వాత రెండు, మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఆర్టీసీ, టీఎస్ఐఐసీ, రైతు సమన్వయసమితి, మహిళా కమిషన్తోపాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించే అవకాశం ఉందని వివరిస్తున్నాయి. -
మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 28 మంది ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్లోని కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం సోమవారం కేబినెట్ను విస్తరించింది. సీఎం మోహన్ యాదవ్ తన తన మంత్రి వర్గంలోకి 28 మందిని తీసుకున్నారు. 28 మందితో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ సీ పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గీయ, ప్రద్యుమన్ సింగ్ తోమర్, విశ్వాస్ సారంగ్ ఉన్నారు. వీరిలో 18 మంది కేబినెట్ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన మంత్రి వర్గంలో అయిదుగురు మహిళలు ఉన్నారు. మొత్తం 28 మంది మంత్రుల్లో 11 మంది ఓబీసీ వర్గానికి చెందిన వారు ఉన్నారు. అయిదుగురు షెడ్యూల్ కులాలు(ఎస్సీ), ముగ్గురు షెడ్యూల్ తెగల (ఎస్టీ) వర్గానికి చెందినవారు ఉన్నారు. కాగా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి శివరాజ్ సింగ్ చౌహాన్కు కాకుండా మరో నేత మోహన్ యాదవ్కు బీజేపీ అధిష్ఠానం సీఎం పదవి కట్టబెట్టింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ యాదవ్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకత్వం ఎంపిక చేసిన రెండు వారాల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగింది. చదవండి: ‘దేశంలో మోదీకి ప్రత్యామ్నయ నేత ఎవరూ లేరు’ -
ఎన్నికల వేళ.. మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ
భోపాల్: అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న వేళ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా బీజేపీకే చెందిన ఎమ్మెల్యేలు రాజేందర్ శుక్లా, గౌరీశంకర్ బిసెన్, రాహుల్ లోధిలను కేబినెట్లోకి తీసుకున్నారు. కుల, ప్రాంతీయ సమీకరణాల్లో సమతూకం పాటించే లక్ష్యంతో ఒక బ్రాహ్మణ, ఇద్దరు ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) వీరికి తాజాగా ప్రమోషన్ ఇచి్చనట్లు భావిస్తున్నారు. శనివారం ఉదయం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మంగుభాయ్ పటేల్ ముగ్గురితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. తాజా విస్తరణతో మంత్రుల సంఖ్య 34కు చేరింది. -
CM KCR : తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై ఇంకా సస్పెన్స్
హైదరాబద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ కార్యాలయానికి ప్రగతి భవన్ నుంచి లేఖ వెళ్లింది. ప్రమాణస్వీకారానికి సమయం ఇవ్వాలని గవర్నర్ ను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విజ్ఞప్తి వచ్చింది. అయితే సీఎంవో లేఖపై రాజ్ భవన్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గవర్నర్ ఆఫీస్ నుంచి షెడ్యూల్ రాగానే కొత్త మంత్రితో ప్రమాణస్వీకారం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఈటల స్థానంలో పట్నం ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు క్యాబినెట్ విస్తరణను ఒకరికే పరిమితం చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో 18మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం 17 మంది మంత్రులు ఉన్నారు. ఖాళీగా ఉన్న ఈటల స్థానంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక వేళ గంపా గోవర్ధన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే.. ప్రస్తుతమున్న వారిలో ఒకరిని పక్కనపెట్టే అవకాశముంది. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ నిన్న పాండిచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసైకు మంత్రి వర్గ విస్తరణ గురించి సమాచారం అందించడంతో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. అదే సమాచారాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు గవర్నర్. Reached Hyderabad in the afternoon for engagements in Telangana today and tomorrow — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 21, 2023 ఇది కూడా చదవండి: మంత్రివర్గంలోకి ‘పట్నం’.. రేపు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం -
తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఉద్వాసన ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. మొత్తం 119 స్థానాలకు గానూ ఒకే విడతలో 115 మందితో కూడిన తొలి విడత అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. వీరిలో తొమ్మిదిమంది సిట్టింగ్లకు హ్యండ్ ఇచ్చారు. మరో నాలుగు స్థానాలను పెండింగ్లో పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒకే విడతలో భారీ సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. తాజాగా మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో తెలంగాణ కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బుధవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరణ జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈటల రాజేందర్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత చాలా కాలంగా ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఈటల స్థానంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి కేబినెట్లో చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా కామారెడ్డి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో టికెట్ కోల్పోయిన స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్దన్ ను కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. చదవండి: 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తాం.. అక్టోబర్ 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో మంత్రి వర్గంలో 18 మందికి ఛాన్స్ ఉంది. ఎన్నికల వేళ అసంతృప్తితో రగలిపోతున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోనున్నారు. తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేసీఆర్ ప్రకటించారు. అదే స్థానాన్ని కోరుకున్న మహేందర్ రెడ్డిని ఏదోవిధంగా సర్ధుబాటు చేయాలని భావించారు. బుధవారం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో 2014 తెలంగాణ ప్రభుత్వ మొదటి క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా మహేందర్ రెడ్డి పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై బీఆర్ఎస్ లో చేరిన సబితారెడ్డి.. కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్ప్ దక్కించుకోవడంతో… మహేందర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకదశలో పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల ముందు సడెన్ గా పట్నంకు కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు. ఇక గంపా గోవర్ధన్ పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీంతో ఇద్దరిని తీసుకోవాలంటే ఎవరో ఒకరికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. ప్రస్తుతం కెసిఆర్ మంత్రి వర్గంలో ముగ్గురు (సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి) రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే .. సమీకరణాలు మారుతాయి కాబట్టి ఓ రెడ్డి మంత్రిని తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు మూడు నెలలే ఉంది కాబట్టి ఒకరిని బుజ్జగించి మంత్రి పదవి నుంచి తప్పుకోమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాబట్టి అదే జిల్లాకు చెందిన సబితాకు నచ్చజెపుతారా అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఎవరికి ఉధ్వాసన పలుకనున్నారు? లేదా కేవలం మహేందర్ రెడ్డి వరకే పరిమితం చేసి విస్తరణ చేస్తారా అనేది తెలియాల్సి ఉండాలి. కేబినెట్ విస్తరణపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పాండిచ్చేరి నుంచి ఈ రాత్రికి గవర్నర్ హైదరాబాద్ రానున్నారు. -
విపక్షాల ఐక్యతకు కౌంటర్గా ఎన్డీయే బలప్రదర్శన!
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు దృష్టిలో ఉంచుకునే రాజకీయ పరిణామాలు శరవేగంగా.. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీకి అధికారం దూరం చేసే క్రమంలో.. సాధ్యమైనంత వరకు ఐక్యంగా ఉండాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అవసరమైతే ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలపాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోపే బీజేపీ మరో ప్లాన్తో ముందుకు వచ్చింది. విపక్ష కూటమి సమావేశం కంటే ముందే ఎన్డీయే కూటమి బలప్రదర్శన చేయాలని నిర్ణయించుకంది. ఈ మేరకు జులై 18వ తేదీన ఎన్డీయే విస్తృతస్థాయి సమావేశానికి సిద్ధమవుతున్న బీజేపీ.. మిత్రపక్షాలకు సమాచారం అందించింది. ఎన్డీయే పక్షాలనే కాదు.. ఏ కూటమికి చెందని కొన్ని పార్టీలకు సైతం ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్లో అకాలీదళ్, చిరాగ్ పాశ్వాన్ కూడా ఉన్నారు. మరోవైపు కర్ణాటకలో జేడీఎస్తోనూ పొత్తు కోసం యత్నిస్తున్న బీజేపీ.. ఆ పార్టీకి ఆహ్వానం పంపింది. ఇక తమిళనాడులో గత కొంతకాలంగా విబేధాలతో దూరంగా ఉంటూ వస్తున్న మిత్రపక్షం అన్నాడీఎంకేకు సైతం ఆహ్వానం పంపింది. పార్లమెంట్ సమావేశాలకు ముందరే జరగనున్న ఈ కీలక సమావేశం ద్వారా విపక్షాల ఐక్యతకు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణపై సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఇవాళ(గురువారం) మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ భేటీ జరిగింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో.. కేబినెట్ మార్పులు చేర్పులపైనే ప్రధానాంశంగా చర్చ జరిగింది. ఈ శని లేదంటే ఆదివారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల దృష్ట్యానే ఈ కేబినెట్ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. -
కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?
బెంగళూరు: కర్ణాటకలో శనివారం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. గత వారమే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు మరో 8 మంది మంతత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిచే గవర్నర్ తావర్చంద్ గెహ్లత్ శనివారం రాజ్భన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్ మొత్తం 34 మందితో పూర్తిగా ఉంది. కాగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వారికి శాఖల కేటాయింపులను అధికారికంగా ప్రకటించలేదు. అయితే కీలక శాఖలన్నీ సిద్ధరామయ్య తనవద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికశాఖ, కేబినెట్ వ్యవహారాలు, బ్యూరోక్రసీ, ఇంటలిజెన్స్ వంటి శాఖలను సిద్దూ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు నీటిపారుదల శాఖతోపాటు బెంగళూరు నగర అభివృద్ధిని అప్పగించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జీ పరమేశ్వరకు హోంమంతత్రిత్వ శాఖ కేటాయించే అవకాశం ఉంది. కేజే జార్జ్కు న్యాయ శాఖ, చెలువరాయస్వామికి వ్యవసాయం, మునియప్పకు ఆహారం, పౌర సరాఫరాలు, సతీష్ జారికిహోళికి పబ్లిక్ వర్క్స్, బైరతి సురేష్కు పట్టణాభివృద్ధి శాఖ, ఎంబీ పాటిల్ పరిశ్రమల బాధ్యతలు, నాగేంద్రకు యూత్& స్పోర్ట్స్, వెంకటేష్కు పశుపోషణ, తిమ్మపూర్ ఎక్సైజ్, రామలింగారెడ్డి రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు కేటాయించే ఛాన్స్ ఉంది. అయితే మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే అంటూ ఓ ప్రకటన సోషల్ మీడియాలోవైరల్గా మారింది. చదవండి: ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తే.. కాంగ్రెస్ బూడిదవుతుంది: బీజేపీ హెచ్చరిక శనివారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మాజీ సీఎం ఆర్. గుండురావు తనయుడు దినేశ్ గుండు రావు, మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర ఖండ్రేతో పాటు కృష్ణభైరేగౌడ, రహీంఖాన్, సంతోశ్లాడ్, కేఎన్ రాజణ్ణ, కే వెంకటేశ్, హెచ్.సి.మహదేవప్ప, భైరతి సురేశ్, శివరాజ్ తంగడిగి, ఆర్బీ .తిమ్మాపుర్, బి.నాగేంద్ర, డి.సుధాకర్, లక్ష్మీ హెబ్బాళ్కర్, చలువరాయస్వామి, మంకుళ్ వైద్య, ఎంసీ .సుధాకర్, హెచ్.కె.పాటిల్, శరణ్ప్రకాశ్ పాటిల్, శివానందపాటిల్, ఎస్.ఎస్.మల్లికార్జున, శరణబసప్ప దర్శనాపూర్ ఉన్నారు. మొత్తం కేబినెట్లో ఒకే ఒక్క మహిళకు చోటు దక్కింది. బెళగావి రూరల్ నుంచి రెండోసారి ఎన్నికైన లక్ష్మీ హెబ్బాళ్కర్ను మంతత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఈమె పేరును డీకే ప్రతిపాదించారు. మంత్రివర్గంలో అయిదుగురు వక్కలిగ వర్గం.. ఏడుగురు లింగాయత్ వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. అయిదుగురు రెడ్డీ, ఆరుగురు ఎస్సీ, ముగ్గురు ముస్లిం మైనార్టీ, ముగ్గురు ఎస్టీ, ఆరుగురు ఓబీసీ , ఒక బ్రహ్మాణ, ఒక మరాఠా, ఒక క్రిస్టియన్, ఒక జైన్ మంత్రి ఉన్నారు. చదవండి: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. ఏమన్నారంటే? Live ನೂತನ ಸಚಿವರ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕಾರ ಸಮಾರಂಭ https://t.co/y1KDAW2Byl — Karnataka Congress (@INCKarnataka) May 27, 2023 -
మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్సిగ్నల్
సాక్షి బెంగళూరు: పూర్తి స్థాయి కేబినెట్కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం శనివారం జరగనుంది. ఇప్పటికే 8 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, తాజాగా మరో 24 మంది శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ జాబితాతో ఢిల్లీకి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ అక్కడ అధిష్టానంతో చర్చించి తుది జాబితాకు ఆమోదం పొందారు. ప్రస్తుతం మంత్రివర్గంపై ఓ కొలిక్కి రావడంతో ఇక శాఖల కేటాయింపు అంశంతో సిద్ధరామయ్య ముందు మరో కొత్త తలనొప్పి రానుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ తమ సన్నిహితులకు మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేశారు. ఇక ఈ నూతన మంత్రులకు శాఖల కేటాయింపులోనూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం వరించకపోవడంతో కీలక శాఖలు తనకు అప్పగించాలని డీకే శివకుమార్ పట్టుబడుతున్నట్లు సమాచారం. రెండు రోజులుగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో వరుస సమావేశమవుతూ మంత్రివర్గం కూర్పును ఒక కొలిక్కి తీసుకువచ్చారు. కాగా, పూర్తి స్థాయి మంత్రివర్గానికి అధిష్టానం ఆమోదం చెప్పినట్లు తెలిసింది. దీంతో కొత్తగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరు రాజ్భవన్లో ఉదయం 11.45 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. కాగా తొలుత 20 మందిని మంత్రులుగా ప్రకటించి మరో నాలుగు స్థానాలను పెండింగ్లో పెట్టాలని భావించారు. అయితే మంత్రి పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో ఒకేసారి 24 స్థానాలు భర్తీ చేయాలని చివరికి నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణలో కొందరు సీనియర్లకు మొండిచేయి తప్పేలా లేదు. సీనియర్లు ఆర్వీ దేశ్పాండే, దినేశ్ గుండూరావు, అప్పాజీ నాడగౌడ, టీబీ జయచంద్ర, బీకే హరిప్రసాద్ వంటి నేతలకు మంత్రి పదవులు దక్కకపోవచ్చు. అయితే వీరంతా ఢిల్లీలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామనే హామీతో హైకమాండ్ పంపిస్తున్నట్లు తెలిసింది. -
మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ..? దీపాలి దాస్కు బెర్తు పక్కా!
భువనేశ్వర్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ సోమవారం జరగనున్నట్లు తెలుస్తోంది. స్వస్థలం హర్యానా పర్యటనలో ఉన్న గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్ ఆదివారం భువనేశ్వర్కు తిరిగి రానున్నారు. దీంతో 22న కొత్త మంత్రులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరిలో ఇటీవల ఝార్సుగుడ నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థిపై భారీ ఆధిక్యతతో గెలుపొందిన దివంగత మంత్రి కుమార్తె దీపాలి దాస్కు మంత్రి బెర్తు లభించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. కొనసాగుతున్న మంత్రి మండలిలో ఇటీవల ఇద్దరు మంత్రులతో పాటు స్పీకర్ విక్రమ కేశరి అరూఖ్ రాజీనామా చేశారు. మిగిలిన ఇద్దరిలో మంత్రులు సమీర్ రంజన్ దాస్, శ్రీకాంత్ సాహు ఉన్నారు. స్పీకర్ పదవికి రాజీనామా చేసిన విక్రమ్ కేశరి అరుఖ్కు కొత్త మంత్రి మండలిలో స్థానం లభిస్తుందని ఊహాగానాలు బలంగా వ్యాపించి ఉన్నాయి. మరో కొత్త ముఖం ఎవరనేది ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఈ ఖాళీల భర్తీతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొంతమంది మంత్రుల శాఖలను మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?.. భారీ మార్పులు?
సాక్షి, ఢిల్లీ: త్వరలో కేబినెట్ విస్తరణకు కేంద్రం సన్నద్ధమవుతోంది. పునర్వ్యవస్థీకరణ, విస్తరణ చర్చలు జోరందుకున్న క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశముంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. దీంతో పార్టీ సంస్థాగతంగానూ పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు 2024లో లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంలో, పార్టీలో భారీ మార్పులుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, తెలంగాణపై కమలదళం ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ విస్తరణలో ఇక్కడి నుంచి మరొకరికి మంత్రి పదవి వరించనుందనే ప్రచారం సాగుతోంది. ఆ దిశగా ప్రధాని మోదీ యోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ నుంచి లోక్సభకు, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్ మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు -
Cabinet Expansion: ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఒక స్పష్టత రాలేకపోయింది. దీంతో మంత్రివర్గ విస్తరణ సందిగ్ధంలో పడిపోయింది. శిందే, ఫడ్నవీస్, అమిత్షా మధ్య రాష్ట్రానికి చెందిన అంశాలపై 30 నిమిషాలపాటు కీలక సమావేశం జరిగినప్పటికీ కనీసం మంత్రివర్గ విస్తరణ తేదీ కూడా నిర్ణయించలేక పోయారు. దీంతో మంత్రివర్గ విస్తరణ వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశముందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచింది. మొదటి దశ మంత్రివర్గ విస్తరణ చేపట్టి నాలుగు నెలలు కావస్తోంది. ప్రభుత్వంలో శిందే, ఫడ్నవీస్సహా 20 మంది మంత్రులు కొనసాగుతున్నారు. అప్పట్లో మిగతా వాటిలో 13 శాఖలు శిందే తమ వద్దే ఉంచుకున్నారు. క్యాబినెట్లో తమకు స్ధానం లభించకపోవడంతో మిగతావారు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అసంతృప్తులను సంతృప్తి పరిచేందుకు త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. కాని నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంతో ఇటు శిందే వర్గం, అటు ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మంత్రివర్గంలో తమకు ఎప్పుడు స్ధానం లభిస్తుందా..? అని ఇరువర్గాల ఎమ్మెల్యేలు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆశలు అడియాశలవుతున్నాయి. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే రెండో దశ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని నెల రోజుల కిందట శిందే ప్రకటించారు. ప్రస్తుతం మంత్రులపై ఉన్న అదనపు శాఖల భారం తగ్గుందని తెలిపారు. దీంతో ఇరువర్గాల ఎమ్మెల్యేలలో కొంత ఆశలు చిగురించాయి. కానీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గరపడుతోనప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. శీతాకాల సమావేశాల్లో తన వద్ద ఉన్న 13 శాఖలకు సంబంధించి ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఒక్కరే సమాధానమివ్వడం సాధ్యం కాదని శిందే ముందే తెలుసుకున్నారు. దీంతో శిందే తన వద్ద ఉన్న 13 శాఖల బాధ్యతలు ఇతర మంత్రులకు అప్పగించారు. దీన్నిబట్టి మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని ఇరు వర్గాల ఎమ్మెల్యేలకు పరోక్షంగా తెలిసిపోయింది. కాని త్వరలో అమిత్ షాతో భేటీ అయి మంత్రి వర్గ విస్తరణపై చర్చించి ఒక స్పష్టత తీసుకొస్తామని శిందే, ఫడ్నవీస్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేలలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఆ ప్రకారం బుధవారం ఢిల్లీలో అమిత్షాతో శిందే, ఫడ్నవీస్, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై భేటీ అయ్యారు. సమావేశం అనంతరం శిందే, ఫడ్నవీస్ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన సమస్యలపై సుమారు 30 నిమిషాలు కేంద్ర హోంమంత్రితో చర్చించారు. కానీ ఈ సమావేశంలో నాగ్పూర్లో ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు చేపట్టాల్సిన మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో పరిస్ధితి మళ్లీ మొదటికే వచ్చింది. దీంతో ఇరు వర్గాల ఎమ్మెల్యేలలో ముఖ్యంగా శిందే వర్గం ఎమ్మెల్యేలలో అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. శాసనసభ శీతాకాల సమావేశాలకు ముందు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. శీతాకాల సమావేశాల తర్వాత చేయవచ్చనే మీడియా కథనాన్ని ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి. శీతాకాల సమావేశాల తరువాతే! నిజానికి శీతాకాల సమావేశాల తర్వాత చేయొచ్చని మీడియా కథనాలను ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో అమిత్ షాతో అర్థరాత్రి జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని ఖరారు చేశారు. ఈ సమావేశానికి ఫడ్నవీస్, షిండే ఇద్దరూ హాజరయ్యారు. నిజానికి శీతాకాల సమావేశాలకు ముందే షిండే–ఫడ్నవీస్ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ముందుగా భావించారు. కానీ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పుడు శీతాకాల సమావేశాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం భయపడుతోంది... ప్రస్తుతం, మంత్రివర్గంలో ముఖ్యమంత్రి శిందే, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో సహా 20 మంది కేబినెట్ ర్యాంక్ మంత్రులు ఉన్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో జాప్యంపై విపక్షాలు దూకుడు పెంచాయి. శిందే, ఫడ్నవీస్లు ప్రతి ఎమ్మెల్యేకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకే ఇప్పుడు తమకు మంత్రి పదవులు ఇవ్వకపోతే అసంతృప్త ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని బీజేపీ భయపడుతోందని వారు వ్యాఖ్యానించారు. -
Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా!
సాక్షి, ముంబై: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలకు మళ్లీ నిరాశే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి నాగ్పూర్లో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గత నెలలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసి తేదీ ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు. అంతేగాకుండా డిసెంబరు 5–9 తేదీల మధ్య ఏదో ఒకరోజు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని శిందే, ఫడ్నవీస్ సంకేతాలిచ్చారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం, ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో ఆనందం వెల్లివిరిసింది. కానీ ప్రత్యక్షంగా ఈ ముహూర్తం కూడా దాటిపోయే అవకాశం ఏర్పడింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఇంతవరకు శిందే, ఫడ్నవీస్ మధ్య సాధారణ చర్చగాని, సమావేశంగాని జరగలేదు. దీంతో ఇరువర్గాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో తిరుగుబాటు లేదా దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెలరోజులకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన తొమ్మిది మంది చొప్పున ఇలా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా వారికి ఆవకాశం దొరకకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ఇటు మహిళా వర్గం నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రెండో దశ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని అందులో మహిళలకు చోటు కల్పిస్తామని అప్పట్లో అందరినీ బుజ్జగించే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా అప్పట్లో ఏక్నాథ్ శిందేతోపాటు శివసేన నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలోని మంత్రివర్గంలో తమకు చోటు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. ఆ విధంగా తనతో వచ్చిన ఎమ్మెల్యేలందరికీ శిందే హామీ కూడా ఇచ్చారు. కానీ ఆ ఆశ నిరాశకు గురిచేసింది. శిందే వర్గం ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తి రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఫలితంగా శిందేపై తిరుగుబాటుచేసి మళ్లీ సొంత గూటి (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) లోకి చేరే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే శిందే, ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షో¿భంలో చిక్కుకోవడం ఖాయం. ఆ పరిస్ధితి రాకముందే శిందే, ఫడ్నవీస్ జాగ్రత్త తీసుకున్నారు. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతామని శిందే, ఫడ్నవీస్ ప్రకటించి అసంతృప్తులందరినీ సంతృప్తి పరిచే ప్రయత్నం జరిగింది. కానీ అసంతృప్తులకు హామీ ఇచ్చి దాదాపు ఐదు నెలలు కావస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు సమయం కూడా దగ్గరపడుతోంది. ఈ నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలి. కానీ ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదు. కనీసం శిందే, ఫడ్నవీస్ మధ్య చర్చ కూడా జరగడం లేదు. శిందే, ఫడ్నవీస్ ఆదివారం నాగ్పూర్–షిర్డీ హై స్పీడ్ కారిడార్పై ట్రయల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఫడ్నవీస్ ఢిల్లీ వెళతారని తెలిసింది. ఈ నెల 11వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నాగ్పూర్ పర్యటనకు వస్తున్నారు. ఆ సమయంలో నాగ్పూర్లో మెట్రో రైలు మార్గం, దివంగత బాల్ ఠాక్రే సమృద్ధి మహామార్గ్ నాగ్పూర్–షిర్డీ మొదటి దశ 520 కిలోమీటర్ల మేర మార్గాన్ని మోడీ ప్రారంభిస్తారు. దీంతో మోడీ పర్యటన నేపధ్యంలో శిందే, ఫడ్నవీస్ ఏర్పాట్ల పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తరువాత వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతాయి. దీన్ని బట్టి ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని స్పష్టమవుతోంది. కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులు... అసెంబ్లీ శీతాకాల సమావేశానికి ముందు, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయాలని, రాష్ట్ర బోర్డులు, కార్పొరేషన్ల కేటాయింపులను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులేతో శిందే సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ కోసం కేంద్రం అనుమతి కోసం వేచి ఉండకుండా, కూటమి భాగస్వాములు ఇద్దరూ కలిసి కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులు, కార్పొరేషన్ల కేటాయింపులను ప్రారంభించవచ్చని నిర్ణయించారు. ‘శిందే తిరుగుబాటులో ఆయనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ చేయకుంటే.. విస్తరణలో తమ పేర్లు చేర్చకుంటే ఆందోళనకు దిగుతామని కొందరు హెచ్చరించారు. అసంతృప్త ఎమ్మెల్యేలను కేటాయింపుల ద్వారా శాంతింపజేయడమే సీఎం శిందే ముందున్న తక్షణ సమస్య’’ అని పేరు వెల్లడించని ఒక బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఐదు నెలల క్రితమే తొలి మంత్రివర్గ విస్తరణ జరిగినా, మెజారిటీ మంత్రిత్వ శాఖలు ఇంకా కేటాయించలేదు. ముఖ్యమంత్రి, ఆయన డిప్యూటీలపై గరిష్ట శాఖల భారం ఉంది. అంతేకాకుండా, ఇది ప్రభుత్వ విధానాలపై, పరిపాలన అమలుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. శిందే, ప్రముఖ మంత్రులతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది. అందువల్లనే విస్తరణలను ఆలస్యం చేయడంపై వారు చాలా ఆలోచిస్తున్నారు’’ అని ఆ సీనియర్ బీజేపీ నాయకుడు అన్నారు. కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులను కేటాయిస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడ్డట్టేనని శిందే సన్నిహితుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ‘ఇంతకుముందు క్రీమ్ పోర్ట్ఫోలియోలను డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. మంత్రి పదవి లభించని పక్షంలో బోర్డులతో సరిపెట్టుకోవడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల పోటీ తగ్గుతుంది. కాబట్టి తర్వాత, పోర్ట్ఫోలియోలను పంపిణీ చేయడం, మంత్రివర్గాన్ని విస్తరించడం మాకు సమస్య కాదు. ఇది పక్కా ప్రణాళికతో కూడిన వ్యూహం’ ఆయన అన్నారు. -
ఎమ్మెల్యేలకు దేవేంద్ర ఫడ్నవీస్ తీపి కబురు
సాక్షి, ముంబై: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందోనని కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుభవార్త ఆందించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని నాగ్పూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫడ్నవీస్ ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ ముహూర్తం ఖరారుచేసి తేదీ ప్రకటిస్తుందని ఆయన అన్నారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం, ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా గత మూడు నెలలుగా అసంతృప్తితో బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న శిందే వర్గం ఎమ్మెల్యేల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా నాగ్పూర్లో జరగాల్సిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముంబైలో చాలా తక్కువ రోజులు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి నాగ్పూర్లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండు వారాలపాటు కచ్చితంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలకు అభ్యంతరం లేకుంటే నూతన సంవత్సర వేడుకలు నాగ్పూర్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఉద్ధవ్తో కలవం.. రాజ్ ఠాక్రే సత్సంబంధాలు ఇదిలాఉండగా భవిష్యత్తులో ఉద్ధవ్ ఠాక్రేతో చేతులు కలిపే సమస్యే లేదని విలేకరులడిగిన ఓ ప్రశ్నకు ఫడ్నవీస్ సమాధానమిస్తూ స్పష్టం చేశారు. ఉద్ధవ్ తన మనసుకు చాలా బాధ కల్గించారని, ఆయనతో ఇకపై చేతులు కలిపే ప్రసక్తేలేదని అన్నారు. ఎమ్మెన్నెస్తో పొత్తు పెట్టుకుంటారా? అని విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పార్టీలు వేరైన అనేక ఏళ్లుగా రాజ్ ఠాక్రేతో తమకు సత్సంబంధాలున్నాయి. ఆయన తనకు మంచి మిత్రుడని, రాజకీయంగా కాకపోయిన మంచి మిత్రులుగా కలిసే ఉంటామని ఫడ్నవీస్ వెల్లడించారు. మూడునెలలుగా పెండింగ్లోనూ.. ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెల రోజులకు మంత్రి వర్గ విస్తరణ జరిగింది. మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగి దాదాపు మూడు నెలలు కావస్తోంది. అయినప్పటికీ రెండో దశ విస్తరణకు ఇంకా ముహూర్తం లభించకపోవడంపై ఎమ్మెల్యేలలో అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా శిందే వర్గం ఎమ్మెల్యేలలో అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దీంతో వారిని సంతృప్తి పరిచేందుకు త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. కాని ఇంతవరకు దాని ఊసు ఎత్తడం లేదు. మహిళలకు దక్కని ప్రాధాన్యం అప్పట్లో ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు నెల రోజులకు మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన తొమ్మిది మంది చొప్పున ఇలా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతావారికి ఆవకాశం దొరక్కపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఇటు మహిళా వర్గం నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. దీంతో రెండో దశ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని అందులో మహిళలకు చోటు కల్పిస్తామని అప్పట్లో అందరినీ బుజ్జగించే ప్రయత్నం జరిగింది. రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి ముఖ్యంగా అప్పట్లో ఏక్నాథ్ శిందేతోపాటు శివసేన నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలోని మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ ఆశ నిరాశకు గురిచేసింది. శిందే వర్గం ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తి రోజురోజుకు తీవ్రరూపం దాల్చసాగింది. ఫలితంగా శిందేపై తిరుగుబాటుచేసి సొంత గూటిలోకి (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) చేరే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ అదే జరిగితే బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయం. ఆ పరిస్ధితి రాకముందే శిందే, ఫడ్నవీస్ జాగ్రత్త తీసుకున్నారు. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతామని ఫడ్నవీస్ ప్రకటించి ఈ అంశానికితెరదించారు. (క్లిక్ చేయండి: మరో ‘మహా’కూటమి?.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు పావులు) -
ప్రభుత్వ ఏర్పాటులో ‘కీలక’పాత్ర ఉంటే మాత్రం ఇచ్చేయడమేనా!!
ప్రభుత్వ ఏర్పాటులో ‘కీలక’పాత్ర ఉంటే మాత్రం ఇచ్చేయడమేనా!! -
Maharashtra: ఫడ్నవీస్కు కీలక శాఖ.. మంత్రులకు శాఖల కేటాయింపులివేనా?
సాక్షి,ముంబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల తర్వాత మినీ మంత్రివర్గ విస్తరణ, మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రక్రియ మంగళవారం పూర్తయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఎవరికీ మంత్రిత్వ శాఖల కేటాయింపు జరగలేదు. ఇప్పుడు అందరి దృష్టి ఎవరెవరికి ఏయే మంత్రిత్వ శాఖలు లభిస్తాయనే అంశం తెరమీదకు వచ్చింది. తమకు కీలక శాఖల బాద్యతలు అప్పగిస్తారా లేక అంతగా ప్రాధాన్యత లేని శాఖలు లభిస్తాయా అనే దానిపై మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో చర్చ మొదలైంది. దీంతో శిందే, ఫడ్నవీస్ తీసుకునే తుది నిర్ణయంపై దృష్టి సారించారు. తాజా మంత్రివర్గ విస్తరణతో శిందే, ఫడ్నవీస్తోపాటు మొత్తం 20 మంది మంత్రులు కలిసి ప్రభుత్వాన్ని నడిపించనున్నారు. రాష్ట్రంలో అత్యంత కీలక పదవైన హోం శాఖను దేవేంద్ర ఫడ్నవీస్ దక్కించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై శిందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహిళలకు దక్కని ప్రాతినిధ్యం ఇదిలాఉండగా రాష్ట్ర కేబినెట్లో గరిష్టంగా 43 మంది ఎమ్మెల్యేలను తీసుకునే అవకాశమున్నప్పటికీ మొదటి దశలో ఇరు వర్గాల నుంచి 18 మందిని చేర్చుకున్నారు. మహిళలకు 50% రిజర్వేషన్ అమలులో ఉన్నప్పటికీ 1957–2019 మధ్య కాలంలో కేవలం 40 మంది మహిళలకు మంత్రి మండలిలో స్థానం లభించింది. అందులో 18 మంది మహిళలకు కేబినెట్లో, 22మంది మహిళలకు సహాయ మంత్రులుగా పదవులు లభించాయి. కాగా, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిందే, ఫడ్నవీస్ వర్గం వద్ద మొత్తం 14 మంది మహిళా ఎమ్మెల్యేలున్నారు. కానీ మొదటిసారి చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి వరించలేదు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి శిందే వద్ద నగరాభివృద్ధి శాఖ, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వద్ద అత్యంత కీలకమైన హోం శాఖను ఉంచుకునే అవకాశాలున్నాయి. మిగతా మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలనే దానిపై తుది జాబితా అధికారికంగా ప్రకటించలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏ మంత్రికి, ఏ శాఖ లభించే అవకాశాలున్నాయో వాటి వివరాలు మంత్రివర్గ విస్తరణ ప్రత్యేకతలు ►ఔరంగాబాద్ జిల్లాకు ఏకంగా మూడు మంత్రి పదవులు ►మహిళలకు స్థానం కల్పించకుండా మంత్రివర్గ విస్తరణ చేపట్టడం ఇదే ప్రథమం ►భాగస్వామ్య పార్టీలకు మంత్రి పదవులు లేవు ►మంత్రివర్గంలో స్థానం లభించిన శిందే వర్గంలోని మంత్రులందరూ ధనవంతులే ►కొత్త మంత్రివర్గంలో చోటు లభించిన మంత్రుల్లో 70% మందిపై వివిధ కేసులు నమోదై ఉన్నాయి ►ఇరు వర్గాల మధ్య 35–65 ఫార్మూల ఒప్పందం ఉన్నప్పటికీ 50–50% మంత్రి పదవులు కేటాయించారు ►నేరారోపణలున్న అబ్దుల్ సత్తార్, సంజయ్ రాథోడ్కు మంత్రివర్గంలో మళ్లీ స్థానం కల్పించడం ఇదిలా ఉండగా శిందే, ఫడ్నవీస్ వర్గీయులకు మాత్రమే మంత్రిమండలిలో స్థానం లభించడంతో భాగస్వామ్య చిన్న, చితక పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలలో కొంత అసంతృప్తి వాతావరణం నెలకొంది. ఇప్పటికే కొందరు తమ అసంతృప్తిని బహిరంగంగానే బయటపెట్టారు. తదుపరి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుంది? తమకు అవకాశం ఎప్పుడు లభిస్తుందనే దానిపై ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే రెండో దశ మంత్రివర్గ విస్తరణ సెప్టెంబరులో ఉంటుందని శిందే వర్గానికి చెందిన ప్రహార్ సంఘటన ఎమ్మెల్యే బచ్చు కడూ స్పష్టం చేశారు. అందులో అసంతృప్తులందరికీ స్థానం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. 18 మంది మంత్రుల ప్రమాణస్వీకారం
-
కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్.. 18 మంది మంత్రులు వీరే
సాక్షి, ముంబై: ఎట్టకేలకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెందిన మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. 18 మందితో మహారాష్ట్ర కేబినెట్ కొలువుదీరింది. మంత్రి వర్గంలో బీజేపీ నుంచి తొమ్మిది,షిండే వర్గం నుంచి 9 మందికి చోటు లభించింది. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ 18 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం: చంద్రకాంత్ పాటిల్,సుధీర్ మునగంటివార్, గిరీష్ మహాజన్, సురేశ్ ఖడే, రాధాకృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గవిత్, అతుల్ సేవ్ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గం: దాదా భుసే, శంభురాజ్ దేశాయ్, సందీపాన్ భుమరే, ఉదయ్ సామంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్ ఉన్నారు. మంత్రుల జాబితా ఇదే Chandrakant Patil and Vijay Kumar Gavit are among the nine BJP leaders who are taking oath as ministers in Maharashtra Cabinet at Raj Bhavan in Mumbai pic.twitter.com/DCyzwjEVVa— ANI (@ANI) August 9, 2022 కాగా బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు హోంశాఖ దక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. శిండే, ఫడ్నవీస్ ముందుగా కుదుర్చుకున్న 35–65 ఫార్మూలా ప్రకారం ప్రస్తుతం మినీ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇక శివసేన ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్లు సీఎం, డిప్యూటీ సీఎంలుగా జూన్ 30న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. Maharashtra Cabinet expansion | Governor Bhagat Singh Koshyari administers the oath of office to 18 MLAs as ministers pic.twitter.com/2eDIBVxWj3 — ANI (@ANI) August 9, 2022 -
మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. అగ్రస్ధానంలో ఉన్న ఎమ్మెల్యేలు వీరే
సాక్షి, ముంబై: నెల రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెందిన మంత్రివర్గ విస్తరణకుæ ఎట్టకేలకు ముహూర్తం లభించింది. శిందే, ఫడ్నవీస్ ముందుగా కుదుర్చుకున్న 35–65 ఫార్మూలా ప్రకారం ప్రస్తుతం మినీ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ నివాసమైన రాజ్ భవన్లో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన 18–20 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఆ తరువాత మరోదశలో శిందే, ఫడ్నవీస్ వర్గంతోపాటు భాగస్వామ్య చిన్నాచితక పార్టీల ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అందుకోసం రాజ్ భవన్లోని సెంట్రల్ హాలులో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అంతేగాకుండా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నేతలు, పదాధికారులు, శివసైనికులు, మద్దతుదారులు రాజ్భవన్కు వచ్చి ఆందోళన చేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజ్భవన్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద, రాజ్ భవన్ వచ్చే మార్గంలో, పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మంత్రివర్గ విస్తరణ మంగళవారం ఉదయం పూర్తికాగానే ఈ నెల 10–17 తేదీల మధ్య వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ రూపొందించడంలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ నిమగ్నమైంది. త్వరలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన తుది షెడ్యూల్ అధికారికంగా విడుదల చేయనుంది. ఇదిలాఉండగా మంత్రివర్గంలో స్ధానం లభించిన ఇరు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలందరూ సోమవారం రాత్రి వరకు ముంబైకి చేరుకోవాలని సమాచారం పంపించారు. సీనియర్లకు పెద్దపీట.. బీజేపీ నుంచి ఇదివరకు మంత్రులుగా పనిచేసిన అనుభవం, పాత ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో మళ్లీ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత కొత్త ముఖాలకు అవకాశమివ్వనున్నట్లు తెలిసింది. ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటన ముగించుకుని ముంబైకి చేరుకున్న తరువాత సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫడ్నవీస్ శిందే నివాసమైన నందన్వన్ బంగ్లాకు చేరుకున్నారు. అక్కడ సుమారు గంటన్నరకుపైగా మంత్రివర్గ విస్తరణపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎలాంటి వివాదాలకు తావీయకుండా సోమవారం రాత్రే మంత్రివర్గ విస్తరణ చేపట్టి, ఆ తరువాత ప్రమాణ స్వీకారం చేయించాలని శిందే, ఫడ్నవీస్ భావించారు. కాని ఇంత తక్కువ సమయంలో తమ తమ నియోజక వర్గాలలో నివాసముంటున్న ఇరు వర్గాల ఎమ్మెల్యేలందరినీ ముంబైకి రప్పించడం సా«ధ్యం కాదని గుర్తించారు. చివరకు మంగళవారం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. చదవండి: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. ఎట్టకేలకు విస్తరణ కొలిక్కి... గత నెలలో శివసేన పార్టీలో అసంతృప్తితో ఉన్న ఏక్నాథ్ శిందే 50 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటుచేసి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు, మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల మధ్య ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తరువాత జూన్ 30న ఏక్నాథ్ శిందే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ప్రక్రియ చకచకా జరిగిపోయిన విషయం తెలిసిందే. కాని బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నెల మీద వారం రోజులు కావస్తున్నప్పటికీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంపై మహావికాస్ ఆఘాడికి చెందిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. అధికారం చేజారిపోవడంతో ఇప్పటికే మహా వికాస్ ఆఘాడి నేతలు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి వర్గంలో శిందే, ఫడ్నవీస్ ఇద్దరే ఉన్నారని, ప్రభుత్వ పాలన ఇద్దరి చేతుల మీదుగానే కొనసాగుతుందని దుయ్యబట్టసాగారు. సంబంధిత శాఖల మంత్రులు, జిల్లా ఇంచార్జి మంత్రులు లేక ప్రభుత్వ పనులు కుంటుపడుతున్నాయి. అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని, వరద బాధితులకు సాయం, పంటల నష్టానికి చేపట్టాల్సిన పంచనామ పనులు పూర్తికావడం లేదని ప్రతిపక్షాలు పనిగట్టుకుని మరీ దుమ్మెత్తి పోస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపడతారని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు త్వరలో ఉంటుందనే సమాధానమిస్తున్నారే తప్ప ముహూర్తం ఖరారు చేయడం లేదు. కాగా తిరుగుబాటు శిందే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యే సస్పెన్షన్ కేసు సుప్రీం కోర్టులో పెండింగులో ఉంది. తీర్పు తరుచూ వాయిదా పడుతుండడం వల్లే మంత్రివర్గ విస్తరణ కూడా వాయిదా వేస్తున్నారని ఆరోపించసాగారు. తాజాగా ఆగస్టు 8న జరగాల్సిన విచారణ మళ్లీ ఆగస్టు 12కు వాయిదా పడింది. దీంతో మంత్రి వర్గ విస్తరణ మళ్లీ వాయిదా వేస్తుండవచ్చని మహావికాస్ ఆఘాడి నేతలు భావించారు. అయితే సుప్రీం కోర్టు తీర్పుకు, మంత్రివర్గ విస్తరణకు ఎలాంటి సంబం«ధం లేదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. తీర్పు వెలువడే వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకూడదని సుప్రీం కోర్టు ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఎట్టకేలకు శిందే, ఫడ్నవీస్ మంగళవారం ముహూర్తం ఖరారుచేసి గత నెల రోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ప్రమాణ స్వీకారంలో అగ్రస్ధానంలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు.. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం: దేవేంద్ర ఫడ్నవీస్, చంద్రకాంత్ పాటిల్, జయ్కుమార్ రావల్, రాథాకృష్ణ విఖే పాటిల్, ప్రవీణ్ దరేకర్, రవీంద్ర చవాన్, నితేష్ రాణే, గిరీష్ మహాజన్, సుధీర్ మునగంటివార్, సంజయ్ కుటే ఉన్నారు. వీరిలో ఎంత మంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది మంగళవారం తేలనుంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం: గులాబ్రావ్ పాటిల్, దీపక్ కేసర్కర్, దాదా భుసే, అబ్దుల్ సత్తార్, శంభురాజ్ దేశాయ్, సంజయ్ శిర్సాట్, సందీపాన్ భుమరే, ఉదయ్ సామంత్ తదితరులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. -
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్కు హోంశాఖ?
న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ వారంలో తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు అత్యంత కీలకమైన హోంశాఖ అప్పగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఆగస్టు 15లోగా కేబినెట్ విస్తరణకు సీఎం షిండే సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 30న ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ ప్రమాణం చేశారు. అప్పట్నుంచి వారిద్దరితోనే కేబినెట్ నడుస్తూ ఉండడంతో విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విమర్శల్ని ఫడ్నవీస్ కొట్టిపారేశారు. ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ చేసిన విమర్శల్ని తిప్పికొడుతూ వారి ప్రభు త్వంలో మొదటి 32 రోజులు కేవలం అయిదుగురే ఉన్న విషయాన్ని అజిత్ దాదా మర్చిపోయారా అని గుర్తు చేశారు. ఆగస్టు 15లోగా మహారాష్ట్ర ప్రభుత్వ విస్తరణ జరగనుంది. చదవండి: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు: కేజ్రీవాల్ -
ఒకేఒక్క ఎమ్మెల్యేతో జాక్పాట్.. కేబినెట్లో చోటు!
ముంబై: మహారాష్ట్రలో శివ సేన చీలిక తర్వాత.. రెబల్ వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారించింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలూ ఉన్నందునా.. రాజకీయ స్థిరత్వం కోసం పావులు కదుపుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రేను ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిశారు. దాదర్(మధ్య ముంబై)లోని థాక్రే నివాసం ‘శివతీర్థ’కు స్వయంగా వెళ్లిన ఫడ్నవీస్.. గంటన్నరకు పైనే మంతనాలు జరిపారు. రాజ్థాక్రేకు గత నెలలో సర్జరీ జరిగింది. అలాగే షిండే వర్గంతో పొత్తు సమయంలో అనూహ్యంగా ఉపముఖ్యమంత్రి పదవికి సుముఖత వ్యక్తం చేశారు ఫడ్నవీస్. ఆ సమయంలో ఫడ్నవీస్ త్యాగాన్ని కొనియాడాడు రాజ్ థాక్రే. ఈ నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా కలిసినట్లు ప్రచారం జరిగింది. అయితే.. మొదటి నుంచి ఎంఎన్ఎస్.. బీజేపీకి మద్దతుదారు పార్టీనే. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యక్ష మద్దతు ప్రకటించింది ఎంఎన్ఎస్. అలాగే త్వరలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకోవైపు మంత్రి వర్గ కూర్పు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయపరమైన చర్చ ఇద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్లో చోటు! మహారాష్ట్రలో బీజేపీ రాజకీయ స్థిరత్వం కోసం ప్రయత్నిస్తోంది. మరో రెండున్నరేళ్ల పాటు అధికారం కొనసాగేందుకు అవసరమైన మద్దతు కూడగడుతోంది. ఈ క్రమంలో షిండే వర్గంతో పాటు చిన్న చిన్న పార్టీలను కూడదీసుకుని ముందుకు వెళ్లాలనుకుంటోంది. గతంలోనూ.. ఇప్పుడూ ఎంఎన్ఎస్ మహారాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. ఇప్పుడు ఉన్నది ఒక్క సీటే అయినా.. కేబినెట్లో స్థానం ద్వారా మరింత మచ్చిక చేసుకోవాలని బీజేపీ-షిండే వర్గం భావిస్తోంది. ఎంఎన్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ప్రమోద్ రతన్ పాటిల్. కల్యాణ్ రూరల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2010లో ఎంఎన్ఎస్ పార్టీ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 29 సీట్లు గెలవడానికి ఈయనే మూలకారణం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఆయనకు పట్టుంది. అందుకే ప్రమోద్కు కేబినెట్ బెర్త్ ఆఫర్ చేస్తోంది బీజేపీ. అయితే.. ఇదికాకుండా మరో ప్రతిపాదన సైతం రాజ్ థాక్రే ముందు ఉంచింది. రాజ్ థాక్రే తనయుడు అమిత్ థాక్రేకు షిండే కేబినెట్లో ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అమిత్ చట్టసభలో సభ్యుడిగా లేడు. ఒకవేళ కేబినెట్ హోదా గనుక ఇస్తే.. ఎమ్మెల్యేగా లేదంటే ఎమ్మెల్సీగా తప్పకుండా గెలవాలి. దీంతో బీజేపీ ఆఫర్పై రాజ్ థాక్రే పార్టీ వర్గంతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
వచ్చే వారంలో మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ వచ్చే వారంలో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో సంపూర్ణ చర్చల తర్వాత మంత్రిమండలి కూర్పు ఉంటుందని తెలిపారు. శనివారం షిండే, ఫడ్నవీస్లు ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేపట్టారు. రాష్ట్రపతి కోవింద్, ప్రధానమంత్రి మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలుసుకున్నారు. అనంతరం సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెబుతున్న మాటల్ని షిండే తోసిపుచ్చారు. 164 మంది ఎమ్మెల్యేలతో తమ ప్రభుత్వం బలంగా ఉందని, పూర్తి కాలం తను పదవిలో ఉంటానని ధీమాగా చెప్పారు. ఒకప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావడం పట్ల అసంతృప్తిగా లేదా అన్న ప్రశ్నకు తాను పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటానని బదులిచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రే నాయకుడని, షిండే నాయకత్వంలో పని చేస్తామనన్నారు. ప్రభుత్వాన్ని పూర్తికాలం విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. శుక్రవారం హోం మంత్రి అమిత్ షాతో షిండే, ఫడ్నవీస్ సుదీర్ఘంగా జరిపిన చర్చల్లో అధికార పంపిణీ కసరత్తు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. -
మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ.. బీజేపీకి పెద్ద పీట?
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనంతరం.. శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, 45 మంది మంత్రులతో నూతన కేబినెట్ను షిండే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, కొత్త కేబినెట్లో బీజేపీకి చెందిన వారు 25 మంది, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి 13 మంది మంత్రులు ఉంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక, స్వతంత్రులకు సైతం కేబినెట్లో స్థానం కల్పించనున్నట్టు తెలుస్తోంది. కాగా, వీరిలో సీఎం షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మినహా అందరూ కొత్తవారేనని సమాచారం. ఇదిలా ఉండగా.. ఏక్నాథ్ షిండే, బీజేపీ మధ్య ఓ ఒప్పందం కుదిరినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందం ప్రకారమే.. శివసేనతో ప్రతీ ముగ్గురు ఎమ్మెల్యేలకు, బీజేపీలో ప్రతీ నలుగురు ఎమ్మెల్యేలకు ఓ మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై జూలై 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. 🔴 New Maharashtra cabinet: 25 ministers from BJP, 13 from Chief Minister Eknath Shinde's Sena, say sources https://t.co/VU6h2cDdEU pic.twitter.com/NXlTPoeb71 — NDTV (@ndtv) July 7, 2022 ఇది కూడా చదవండి: ఉద్ధవ్కు మరో ఎదురుదెబ్బ.. షిండే వర్గంలోకి 66 మంది శివసేన కార్పొరేటర్లు! -
AP: సీఎం జగన్ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కేబినెట్ విస్తరణపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందోనన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం మరోసారి మంత్రివర్గ కూర్పుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. సీఎం జగన్ తుది జాబితా తయారీపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఎం జగన్తో సమావేశమయ్యారు. అయితే, పాత, కొత్త కలయికతో మంత్రి వర్గ కూర్పు ఉండనుంది. కేబినెట్లో 10 మంది పాత మంత్రులే కొనసాగే అవకాశం ఉండగా.. కొత్తగా మరో 15 మందికి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్నారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం వరకు ఫైనల్ లిస్ట్ను సిద్ధం చేసి తర్వాత జాబితాను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు పంపించనున్నారు. -
AP: మంత్రి ఎవరు?, కానిదెవరు?
సాక్షి, అమరావతి: సార్.. మంత్రి పదవులు ఎవరికిస్తున్నారు? బాసు.. టెన్షన్ భరించలేకపోతున్నా.. మా ఎమ్మెల్యేకి మంత్రి పదవొస్తుందో రాదో చెప్పు?గురూ.. మా జిల్లాలో ఎవరెవరు మంతవ్రుతారు? తెలిస్తే చెప్పవా? ఏమండి.. పాత మంత్రులు ఎందరు ఉంటారు? కొత్తగా ఎవరొస్తారు? ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా సాగుతున్న సంభాషణ. ఏ ఒక్కర్ని కదిలించినా ఒక్కటే మాట.. ‘మంత్రి అయ్యేదెవరు’? రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, జనం గుమికూడే ప్రధాన కూడళ్లతోపాటు ఫోన్లలోను కొద్ది రోజులుగా మంత్రి పదవులు ఎవరికి అనేది ఆరా తీయడమే కన్పిస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్కంఠతతో తీవ్ర ఉన్నారు. సామాన్య ప్రజలు సైతం మంత్రులెవరో ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా ప్రతినిధులకు ఫోన్ల తాకిడి కొత్త మంత్రివర్గ కూర్పు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మీడియా ప్రతినిధులకు నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రుల నుంచి ఫోన్ల తాకిడి పెరిగింది. ఫోన్ చేసి మరీ మంత్రులెవరంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అదేమంటే మీడియాకే మందు తెలుస్తుందనేగా మీకు చేస్తున్నదంటూ ఒకింత బెదిరిస్తున్నారు. సమాచారం రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులకు వచ్చిన కొన్ని ఫోన్లతో కొన్ని ఆసక్తికర అంశాలు ఇలా ఉన్నాయి.. మోహన్: అన్నా నమస్తే.. మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తారన్నా? విలేకరి: ఏమో అన్నా.. నాకెలా తెలుస్తుంది. మోహన్: అదేంటన్న మీ మీడియాకే మందు తెలుస్తుంది కదా? విలేకరి: సమీకరణలు, మార్పులు, కూర్పులను ఏదో కొద్దిగా అంచనా వేసి కథనాలు ఇస్తుంటాం. అన్నీ మాకే తెలుసని నీవనుకుంటే ఎలా అన్నా? మోహన్: సరే.. కొంచెం తెలిస్తే చెప్పండన్నా? విలేకరి: అలాగే ఏదైనా తెలిస్తే చెబుతాను. రాంబాబు: సార్.. మంత్రుల లిస్ట్ వచ్చిందా? విలేకరి: లేదండి.. అధికారికంగా విడుదల చేసాకే పూర్తి స్పష్టత వస్తుంది. రాంబాబు: అదేంటి.. కొన్ని పత్రికల్లో ఏకంగా మంత్రుల జాబితాను వేసేస్తున్నారు కదా? విలేకరి: ఉహాగానాలు వంద వస్తుంటాయి. ప్రభుత్వ అధికారిక ప్రకటనతోనే స్పష్టత వస్తుంది. రాంబాబు: మా జిల్లాలో పేర్లు ఏమైనా తెలిశాయా బాసూ.. విలేకరి: జిల్లాలు, సామాజికవర్గాలవారీగా మంత్రులను సీఎం ఎంపిక చేస్తారంట. ఇప్పుడు మనం జిల్లాలో పలానా వాళ్లకు మంత్రి పదవి వచ్చేస్తోందని చెప్పలేం. ఎందుకంటే సామాజికవర్గ సమీకరణల్లో ఒక్కటి మారితే మిగిలిన పేర్లపైన ప్రభావం పడుతుంది. సామాజిక సర్దుబాటులో ఉండే జాబితా కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. మనం అంచనా వేయలేం. శాస్త్రి: టెన్షన్ భరించలేకపోతున్నాం. మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తుందంటారా? విలేకరి: టెన్షన్ ఎందుకండి. సీఎం వద్ద మంత్రుల జాబితా ఉంటుంది. సోమవారం ప్రమాణస్వీకారం కాబట్టి ఆదివారమే మంత్రుల జాబితా ప్రకటిస్తారని అంటున్నారు. మరో 24 గంటలు ఓపిక పడితే మీ టెన్షన్కు తెరపడుతుంది. శాస్త్రి: ఏమోనండీ.. ఈ టెన్షన్ ఎక్కువైపోతోంది. తెలిస్తే చెప్పండి ప్లీజ్.. మంత్రి పదవులపైనా బెట్టింగ్లు సందట్లో సడేమియా అన్నట్టు బెట్టింగ్ రాయుళ్లు ఈ అంశాన్ని కూడా వదల్లేదు. పాత మంత్రుల్లో ఎంత మంది కొనసాగుతారు? కొత్తగా ఎంత మందికి ఇస్తారు? ఏఏ ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారు? ఏ జిల్లాలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి? ఎవరికి ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉంది? అనే అనేక కోణాల్లో పందేలు కడుతున్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ తరహా బెట్టింగ్లు జరుగుతున్నట్టు సమాచారం. చదవండి: AP: కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు! -
AP: మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గతంలో మంత్రులు ప్రమాణం చేసిన చోటే మళ్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగా సచివాలయం పక్కన ప్రమాణస్వీకారాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లను తలశిల రఘురాం, పొలిటికల్ సెక్రటరీ ముత్యాలరాజు పరిశీలించారు. ఏప్రిల్ 11వ తేదీన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
సినిమా లవర్స్కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..
సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైరికల్ ట్వీట్
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
లేఆఫ్స్కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
Advertisement