amp pages | Sakshi

ఏకగ్రీవం కావాలి

Published on Mon, 04/29/2019 - 02:52

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మొత్తం 32 జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవులను కచ్చితంగా గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎంపీపీల విషయంలోనూ ఇదే వ్యూహంతో ఉంది. ఎన్నికలు జరుగుతున్న అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ప్రతి స్థానంలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిషత్‌ ఎన్నికల రెండోదశ నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు.

జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా పలువురు సీనియర్‌ నేతలకు అవకాశం ఇస్తున్నామని, వారి గెలుపు బాధ్యతను స్వయంగా చూడాలని ఆదేశించారు. టీఆర్‌ఎస్‌లోని సీనియర్‌ నేతలు కొందరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదని, అలాంటి వారికి పార్టీ ఇప్పుడు జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అభ్యర్థుల గెలుపు విషయంలో ఎమ్మెల్యేలు అంతా తామై వ్యవహరించాలని సూచించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో అవకాశం ఉన్న ప్రతి స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని ఆదేశించారు.  

స్వయంగా రంగంలోకి దిగండి...
మొదటిదశ ఎన్నికలు జరుగుతున్న 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటిదశ ఎన్నికల నామినేషన్‌ ఉపసంహరణ గడువు ఆదివారంతో ముగిసింది. అయితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆశించిన సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదనే అభిప్రాయంతో ఆ పార్టీ అధిష్టానం ఉంది. రెండుమూడు అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా అన్ని చోట్ల ప్రతిపక్షాల అభ్యర్థులు పోటీలో ఉంటున్నారని గుర్తించింది. దీనిపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం పలువురు ఎమ్మెల్యేలకు సూచనలు చేసింది. రెండు, మూడో దశల్లో అయినా స్వయంగా రంగంలోకి దిగి ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచేలా చూడాలని ఆదేశించింది.

రెండోదశలో 180 జెడ్పీటీసీ, 1,913 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారం రెండోదశ నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశాలతో పలువురు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే క్రమంలో అనుసంధానంగా ఉండే పరిషత్‌ వ్యవస్థలపై పూర్తి ఆధిప్యతం ఉండాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. రాష్ట్రంలో 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాల్లో కచ్చితంగా తమ అభ్యర్థులను గెలిపించుకుంటే ప్రభుత్వ లక్ష్యాలు ప్రజలకు వేగంగా చేరుతాయని భావిస్తోంది. దీంతో అన్ని స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ వ్యూహం అమలు చేస్తోంది.  

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్