‘ఆధార్‌’లో వయస్సు మార్చి.. అడ్డంగా దోచేస్తున్నారు!

Published on Sat, 02/09/2019 - 10:28

సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నేతల అక్రమాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. తమ పార్టీ అధికారంలో ఉండటంతో ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని పచ్చనేతలు దోచేస్తున్నారు. ఆఖరికీ వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను కూడా వదిలిపెట్టడం లేదు. ఏకంగా ఆధార్‌ కార్డుల్లో వయస్సు పెంచేసి వారి పేరిట వచ్చే పెన్షన్‌ను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ వ్యవహారం తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం ‘మీ సేవ’లో వెలుగుచూసింది. ఇక్కడి మీ సేవను అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు ఆధార్‌ కార్డుల్లో వయస్సును మారుస్తున్నారు. తక్కువ వయస్సు ఉన్నా కూడా ఆధార్‌ కార్డుల్లో వయస్సు పెంచి.. వృద్ధుల పేరిట వచ్చే పెన్షన్‌తో తమ జేబులు నింపుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ